బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఇంటి నుంచి రతిక బయటకి వచ్చేసింది. తను బయటకి వచ్చేటప్పుడు ఎవరూ అంతగా ఎమోషనల్ అవలేదు. మొదటి వారంలో సీనియర్ నటి కిరణ్ రాథోడ్ హౌజ్ ని విడిచి వెళ్ళగా.. రెండో వారంలో మరో సీనియర్ నటి షకీలా ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కానీ రతిక వెళ్తే మాత్రం హమ్మయ్య పీడా విరగడ అయిందిలే అనుకున్నట్టుగా పట్టించుకోకుండ ఉన్నారు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకి వచ్చిన తర్వాత రతిక బిగ్ బజ్ ఇంటర్యూలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. అందులో యాంకర్ గా వచ్చిన గలాటా గీతూ రతిక దిమ్మదిరిగే ప్రశ్నలు వేసి నోట్లో నుంచి మాట రాకుండా చేసేసింది.


బిగ్ బాస్ హౌస్ లో అందరినీ వాడుకుని ఆడుకోవాలని చూసిందీ రోజా కానీ చివరికి వాడిపోయిందని రతిక గురించి దారుణంగా ఇంట్రడ్యూస్ ఇచ్చింది. బాహుబలి సినిమాలో వెన్నుపోటు పొడిచిన కట్టప్పని రతిక క్రాస్ చేసినట్టుగా అనిపించిందని తూటాల్లాంటి ప్రశ్నలు వేసింది. ఎవరిని వెన్ను పోటు పొడిచానని రతిక ఎదురు ప్రశ్నించింది. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది, ప్రశాంత్ విషయంలో మొదట చెయ్యి అందించించి నువ్వే కదా అంటే ఏమి తెలియనట్టు “నేనా” అని రతిక అనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే రతిక మొదట ప్రశాంత్ కి ఫేవర్ గా మాట్లాడి రెండో వారానికి అతడితో గొడవకి దిగింది. హౌస్ లోనే కాదు ఇక్కడ కూడ మానిప్యులేట్ చేస్తున్నట్టు ఉందని గీతూ గాలి తీసేసింది. ఎక్స్ అనే ఎమోషన్ ని బాగా వాడుకున్నట్టు అనిపించింది, మీకు బాగా వాడుకోవడం అలవాటు కదా అని ఇన్ డైరెక్ట్ గా రాహుల్ మ్యాటర్ కూడా గీతూ టచ్ చేసినట్టు అనిపించింది.


వాడుకునే అలవాటు ఉంటే వాడుకునే టైమ్ వచ్చినప్పుడు వాడుకునే దాన్ని అని రతిక చెప్పిన సమాధానం అంతగా ఆకట్టుకోలేదు. అనాల్సినవన్నీ అనేసి చివర్లో మర్చిపోయాను అనడం స్ట్రాటజీనా అని ప్రశ్నించింది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అంటారు. కానీ ప్రశాంత్ ని తమ్ముడు అంటూనే తనతో పేకాట ఆడుకున్నావ్ కదా అంటూ గీతూ వేసిన ప్రశ్నలకి రతికకి చెమటలు పట్టాయి. ప్రశాంత్ క్రయింగ్ స్టార్ అయితే నువ్వు కన్నింగ్ స్టార్ అని గీతూ అనడం హైలెట్ గా నిలిచింది.


Also Read: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు


బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత వరకు రతిక.. ఎక్కువగా పల్లవి ప్రశాంత్, శివాజీలతోనే క్లోజ్‌గా ఉండేది. కానీ ఓవారం నామినేషన్స్ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను దూరం పెట్టింది. తాజాగా యావర్‌తో తనకు ఉన్న రిలేషన్‌షిప్‌పై కామెంట్స్ చేశాడని శివాజీని కూడా దూరం పెట్టడం మొదలుపెట్టింది రతిక. అంతే కాకుండా కంటెస్టెంట్స్ అంతా శివాజీకి సపోర్ట్ చేసినా తను మాత్రం అసలు సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో రతిక విషయంలో శివాజీ చాలా హర్ట్ అయ్యారు. ఒకప్పుడు తనను బిడ్డ, బిడ్డ అని ప్రేమగా పిలిచాను. ఎవరైనా తనను ఏమైనా అంటున్నా కూడా పోనీలే చిన్నపిల్ల అని సపోర్ట్ చేశాను అని రతిక బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోతున్నప్పుడు గుర్తుచేసుకున్నారు శివాజీ. ఇక ప్రశాంత్ కూడా కనీసం రతికను పలకరించడానికి దగ్గరకు కూడా వెళ్లలేదు.