బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటైంది. వీరి ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె రాహా కపూర్ జన్మనిచ్చారు. రణ్ బీర్ కపూర్ నటించిన ‘తూ ఝూతి మైన్ మక్కార్‌’ సినిమా మార్చి 8న విడుదలైంది. ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణ్ బీర్ కపూర్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తమ కుమార్తె రాహా కపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కూతురు పుట్టిన తర్వాత తమ జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పుకొచ్చారు రణ్ బీర్ కపూర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రణ్ బీర్. అలియా భట్ భార్యగా, తల్లిగా రేటింగ్ ఇవ్వమని అడిగితే.. ఆమె రెండిటి పాత్రలో అద్బుతంగా ఉందని చెప్పారాయన. ఇంకా చెప్పాలంటే భార్యగా కంటే గొప్ప తల్లిగా ఉంటుందని బదులిచ్చారు రణ్ బీర్. అలాగే తమ కుమార్తె గురించి మరో విషయాన్ని కూడా వెల్లడించారు. సాధారణంగా పిల్లలకు పాలు పట్టించిన తర్వాత తేన్పు రావడం ఎంతో అవసరం అని అన్నారు. బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత కనీసం రెండు సార్లు అలా తేన్పు వచ్చేలా చేయాలని చెప్పారు. అయితే దానికి ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఉందని, అందులో తాను పూర్తిగా ప్రావీణ్యం పొందానని చెప్పుకొచ్చారు రణ్ బీర్. 


Also Read: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో


అలాగే ఏ సెలబ్రెటీలు మీ కూతుర్ని బాగా ఎంటర్టైన్ చేయగలరు అని అడిగితే.. దానికి రణ్ బీర్ స్పందిస్తూ షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ పేర్లు చెప్పారు. అలాగే కరణ్ జోహార్ పేరు కూడా చెబుతూ.. కరణ్, రాహా కోసం మంచి బర్త్ డే పార్టీను ఏర్పాటు చేయగలడు, అతను మంచి ఈవెంట్ ప్లానర్ అంటూ చమత్కరించారు. దీనిపై ఆయన అభిమానులు ఫన్నీ గా స్పందిస్తున్నారు.


Read Also: సారా కాదు రష్మిక - అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్న క్రికెటర్ శుభ్‌మాన్ గిల్


ఇక రణ్ బీర్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ‘తూ ఝూతి మైన్ మక్కార్‌’ లో నటించారు. ఈ సినిమా లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది.  ఈ చిత్రంలో అనుభవ్ సింగ్ బస్సీ, డింపుల్ కపాడియా, బోనీ కపూర్ కూడా సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత రణ్ బీర్ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు.