టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట విషాదం నెలకొంది. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క బ్లోసన్ మృతి చెందింది. దీంతో రకుల్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. తన పెట్ డాగ్ మృతికి సంతాపం తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది రకుల్. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో రకుల్ ఇలా రాసుకొచ్చింది. ‘‘నువ్వు మా జీవితాల్లోకి వచ్చి పదహారేళ్లు అయింది. అప్పటినుంచి నువ్ మా జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చావ్. నేను నీతో పాటే పెరిగాను. నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం. నువ్వు ఎంతో చక్కని జీవితాన్ని గడిపావు. వెళ్లే ముందు కూడా ఎలాంటి బాధలు లేకుండా వెళ్లిపోయావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా బాగుండాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. 


అంతే కాకుండా ఆ పోస్ట్ కు తన పెట్ మీద తనకు ఉన్న ప్రేమ తెలిసేలా కొన్ని ఫోటోలను జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి రకుల్ అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. RIP బ్లోసన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  రకుల్ పోస్ట్ పై పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. దీనిపై నటి మంచు లక్ష్మి స్పందిస్తూ ‘‘రెస్ట్ ఇన్ పీస్ బ్లోసన్.. రకుల్ నాకు తెలిసినప్పటి నుంచీ బ్లోసన్ కూడా నాకు తెలుసు’’ అంటూ కామెంట్ చేసింది. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రెటీలు, ఆమె ఫాలోవర్స్ బ్లోసన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. 






రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతకముందు కన్నడలో ఓ సినిమాలో కనిపించింది. తర్వాత తెలుగులో  సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రకుల్. అయితే టాలీవుడ్ లోనే ఆమెకు స్టార్ హీరోయిన్ పేరు వచ్చింది. కానీ ఈ ఏడాది టాలీవుడ్ లో ఆమెకు అంతగా కలసి రాలేదనే చెప్పాలి. వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ‘కొండ పొలం’ సినిమాలో నటించింది రకుల్. అయితే ఈ సినిమా  అంతగా ఆకట్టుకోలేదు. దీని తర్వాత తెలుగులో రకుల్ కు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమీ లేవు. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనట్లు కనిపిస్తోంది. అలాగే ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తుంది.   ఈ మధ్య తన ప్రేమ వ్యవహారంతోనూ నిత్యం వార్తల్లో ఉంటుంది రకుల్. ఆమె ప్రియుడు జాకీ భగ్నాని తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది బ్యూటీ. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు గురించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. తన జీవితంలో శాంటా ఇచ్చిన బహుమతి జాకీనేనని పేర్కొంది. 


Also Read: 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ ఎలా ఉందంటే?