బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ 'రాజు గారి గది'(Rajugari Gadhi) సినిమాతో దర్శకుడిగా మారి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మొదటి సినిమానే ఓ ఫ్రాంచైజీ గా ప్లాన్ చేసి ఒక్కో భాగాన్ని విడుదల చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి 'రాజు గారి గది' 2, 3 సినిమాలు వచ్చాయి. ఇవన్నీ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినవి కావడం విశేషం. ఇక త్వరలోనే 'రాజు గారి గది' పార్ట్ -4 కూడా వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందుగానే ఓంకార్ ఫర్ ది ఫస్ట్ టైం 'మ్యాన్షన్ 24'(Mansion24) పేరుతో ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ కూడా హారర్ కథాంశంతో తెరకెక్కినదే.


మొదటిసారి ఈ వెబ్ సిరీస్ తో ఓంకార్ డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సీరిస్ నుంచి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచగా, రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓంకార్ మార్క్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్ తో 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ఉండబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించింది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు మరో పోస్టర్ని విడుదల చేశారు. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.






ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ నటుడు సత్యరాజ్, అవికా గోర్, మానస్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. మొత్తం 6 ఎపిసోడ్స్ తో హారర్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో 'మ్యాన్షన్ 24' సీరీస్ కథాంశాన్ని మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఓ పాడు పడ్డ మెన్షన్ లోకి వెళ్లిన కాళిదాస్ (సత్యరాజ్) కనిపించకుండా పోతాడు. ఆయనతోపాటు ఆ మ్యాన్షన్ లోకి వెళ్లిన ఎవరు తిరిగి రారు. తన తండ్రి కోసం కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఆ మ్యాన్షన్ లోకి కాళిదాసు కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ అడుగుపెడుతుంది.


అక్కడ ఆమెకి ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి? అసలు ఆ పాడుబడ్డ మ్యాన్షన్ కథేంటి? కాళిదాసు ఆ మ్యాన్షన్ లోకి ఎందుకు వెళ్ళాడు? అనే అంశాలన్నింటినీ ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. 'రాజు గారి గది 3' తర్వాత దర్శకుడుగా విరామం తీసుకున్న ఓంకార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సిరీస్ తో మళ్ళీ డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'బాహుబలి' లో కట్టప్ప పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఫేమస్ యాక్టర్ సత్యరాజ్ నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. భారీ తారాగణంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Also Read : బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో



Join Us on Telegram: https://t.me/abpdesamofficial