బాలీవుడ్ స్టార్ హీరోలు వెబ్ సిరీస్, ఓటీటీ ప్రాజెక్టులు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రేక్షకులలో గుర్తింపు ఉన్న హీరోలు కొందరు ఇప్పటికే చేశారు. మరికొందరు చేయడానికి, ఓ అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేసిన బాలీవుడ్ హీరో, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న బాలీవుడ్ నటుడితో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. పూర్తి వివరాల్లోకి వెళితే...


నీరజ్ పాండే దర్శకత్వంలో వెబ్ సిరీస్...
Emraan Hashmi New Series Netflix: ఇమ్రాన్ హష్మీ... ఈ పేరు హిందీ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు సైతం చాలా బాగా తెలుసు. ఒక సమయంలో ఆయన హీరోగా నటించిన హిందీ సినిమాల్లో పాటలు తెలుగులోనూ విపరీతంగా వినిపించాయి. ఆయనకు సీరియల్ కిస్సర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు ఇమ్రాన్ హష్మీ. ఇప్పుడు ఆయన ఒక వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. 


కమల్ హాసన్, వెంకటేష్ హీరోలుగా నటించిన 'ఈనాడు' సినిమా గుర్తు ఉంది కదా! హిందీ సినిమా 'ఏ వెడ్నెస్ డే'కి అది రీమేక్. ఆ సినిమా తీసినది దర్శకుడు నీరజ్ పాండే. అదొక్కటే కాదు... అక్షయ్ కుమార్ 'బేబీ', 'స్పెషల్ చబ్బీస్' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. హిందీలో థ్రిల్లర్స్ తీయడంలో ఆయనకు సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఒక భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందని తెలిసింది. ప్రస్తుతానికి అది చర్చల దశలో ఉంది.


Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?



ఇమ్రాన్ హష్మీ ఇంతకు ముందు ఒక వెబ్ సిరీస్ చేశారు. 'బార్డ్ ఆఫ్ బ్లడ్' పేరుతో రూపొందిన వెబ్ సిరీస్ వీక్షకులను ఆకట్టుకుంది. మరి, ఈ కొత్త సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి. 'షో టైమ్' పేరుతో మరో వెబ్ సిరీస్ చేశారు. అది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది


Emraan Hashmi upcoming movies Telugu: పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' సినిమాతో పాటు అడవి శేష్ హీరోగా రూపొందుతున్న సూపర్ హిట్ సినిమా గూడచారి సీక్వెల్ 'జీ 2'లో కూడా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో వెబ్ సిరీస్ తీయడం వల్ల నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియన్ ప్రేక్షకుల నుంచి కూడా వ్యూవర్షిప్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ అంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా చూస్తారు. దాంతో ఇమ్రాన్ హష్మీకి మంచి మైలేజ్ కూడా రావచ్చు. ఆల్రెడీ 'స్పెషల్ ఆప్స్' వెబ్ సిరీస్ తీసిన అనుభవం నీరజ్ పాండేకి ఉంది. ప్రజెంట్ 'స్పెషల్ ఆప్స్ 2.0' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.


Also Read'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?