దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి జతకట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ఏప్రిల్ నెలలోనే ప్రకటించినా ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్టీఆర్‌కు 30వ చిత్రం కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఈ సినిమాపై అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు అసంతృప్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో #NTR30 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 


Also Read :సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు..


ఈ చిత్రంలోని నటీనటులు, టెక్నీషియన్లు తదితర వివరాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ వివరాలు కూడా ఇంకా ప్రకటించలేదు. కానీ అలియా భట్, లేదా కియారా అద్వానీలలో ఎవరో ఒకరిని తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రష్మిక పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. 


ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అక్టోబరు 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ పూర్తవ్వగానే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా మొదలవుతుంది. 


అక్టోబర్ నెలలో కొరటాల శివ సినిమా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి వీరి కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పని చేయబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలుని ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. 'ఆచార్య' సినిమా పనులు పూర్తికాగానే కొరటాల.. ఎన్టీఆర్ కథను పూర్తి చేయనున్నారు. 


Also Read : బిగ్‌బాస్‌ సీజన్ 4 విజేతకు ఏమైంది.. ఆ ట్వీట్‌తో అబిజిత్‌ హెల్త్‌పై అనేక అనుమానాలు..


Also Read : 'కలర్ ఫోటో' బ్యూటీ.. గ్లామర్ షోలో నో లిమిట్స్..


Also Read : వేసవికే ఫిక్స్ అయిన రాజమౌళి.. మరి నిర్మాత ఏం చేస్తారో..