‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.  


‘దేవర’ మూవీ నుంచి రెండు ఫోటోలు విడుదల


‘దేవర’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. ఇక మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి లీకులకు తావులేకుండా చూసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు ఫోటోలు విడుదల అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


AI-ఫోటోలు షేర్ చేసిన శ్రీనివాస్ మోహన్


‘దేవర’ సినిమాకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ సూపర్‌ వైజర్ శ్రీనివాస్ మోహన్ రెండు ఫోటోలను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. AI ఇల్యూషన్ టూల్ తో ఎన్టీఆర్ ముఖాన్ని ఇందులో సృష్టించారు. సముద్రం ఒడ్డున ఉన్న పడవలతో ఎన్టీఆర్ ఫేస్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ పిక్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.






‘కారంచేడు’ హత్యాకాండ ఆధారం రూపొందుతున్న ‘దేవర’?


ఇక ‘దేవర’ చిత్రాన్ని దళితులపై జరిగిన దారుణ హత్యాకాండ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కారంచేడు విషాద ఘటనను దర్శకుడు ఇందులో చూపించనున్నట్లు సమాచారం. 1985లో ఆంధ్రప్రదేశ్ లోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనను ‘దేవర’ చిత్రంలో కొరటాల శివ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మామూలుగా కొరటాల శివ సినిమాలు అంటేనే ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం, లేదంటే ఏదైనా సామాజిక అంశాన్ని టచ్ చేస్తూ ఉంటారు.  అదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’ స్టోరీలోనూ కారంచేడు విషాద ఘటన తాలూకు సీన్లు ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘దేవర’


ఇక దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సనసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘దేవర’ వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Read Also: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial