విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార, సమంత కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కాదు వాకులా రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kaadhal) తమిళ సినిమాలో ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుద్ ఇటీవల విడుదల చేసిన వీడియో సాంగ్ తమిళనాడులో వైరల్‌గా ట్రెండవ్వుతోంది. ‘టు టు టు’ (Two Two Two) సాంగ్ ఛాలెంజ్ నేపథ్యంలో తమిళనాడుతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆ పాటకు డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.


తాజాగా ఓ చిన్నారి ఈ పాటను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్, అందులో ఆమె అభినయాన్ని చూసి.. నయన తార బాయ్ ఫ్రెండ్, ఆ చిత్ర నిర్మాత విఘ్నేష్ శివన్ ఫిదా అయ్యాడు. సోనీ మ్యూజిక్ సౌత్ సంస్థ ట్వీట్ చేసిన ఆ వీడియోను రీట్వీట్ చేశాడు. ‘‘ఎంత గొప్పగా చేశావు లిటిల్ యాంజిల్’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇందులోని చిన్నారి మూడు పాత్రల్లో భలే నటించింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు. 


‘టు టు టు’ సాంగ్‌కు చిన్నారి డ్యాన్స్:






విజయ్ సేతుపతి, నయన తార, సమంతా.. ఈ ముగ్గురికి దక్షిణాదిలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. మరి, ఈ ముగ్గురు ఒక చోటే కలిస్తే.. అభిమానులకు కనువిందే. ఈ ముగ్గురు ఇటీవల పబ్లిక్ ప్లేస్‌లో ఒకే బస్సులో ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ కనిపించారు. పద్ధతిగా చీర కట్టుకున్న నయన్, సమంతలతో సేతుపతి సైతం ఫుట్ బోర్డు‌పై నిలబడ్డాడు. ఈ వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ‘కాదు వాకులా రెండు కాదల్’ చిత్రం ‘అన్యోన్యమైన’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఒకప్పుడు అమల, కమలహాసన్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ పాడే ‘‘పరువాలు కనివిని ఎరుగని.. చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్లలో’’ పాటను రిక్రేయేట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, అందులో కమల హాసన్.. అమలతో మాత్రమే కనిపిస్తారు. ఇందులో విజయ్ సేతుపతి నయనతార, సమంతలతో డ్యూయెట్ పాడతారని తెలిసింది.


‘టు టు టు’ ఒరిజనల్ సాంగ్:



ఈ పాటను గ్రీన్ మ్యాట్‌లోనే కానిద్దమని భావించినా.. సహజత్వం కోసం పబ్లిక్ ప్లేసులో షూటింగ్ చేయక తప్పలేదట. దీంతో.. ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన పాత్రల లుక్స్ లీకవ్వడంతో ఇప్పుడు విఘ్నేష్ లబోదిబో అంటున్నాడు. ఏది ఏమైనా.. చీరకట్టులో ఇద్దరూ భలే బాగున్నారంటూ అభిమానులు ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ దాదాపు ముగింపుకు వచ్చింది. సమంతా కూడా మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేసుకొనేందుకు తమిళనాడు వెళ్లింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పుదుచ్చేరీ పరిసరాల్లోనే జరుగుతోంది.  


Also Read: రామ్ చరణ్-శంకర్ మూవీ షూటింగ్ ఈ నెల‌లోనే….చెర్రీ రెమ్యున‌రేష‌న్ పై హాట్ డిస్కషన్
Also Read: నిర్మాత, జూ.ఎన్టీఆర్‌ పీఆర్వో మహేశ్‌ కోనేరు మృతి
Also Read: 'మా' లో ఇంత అలజడి మంచిదికాదు…అలా జరిగి ఉంటే బావుండేదన్న రాఘవేంద్రరావు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి