సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో అందరి ఆలోచన ఆయన సినిమా ‘రిపబ్లిక్’పైనే. దాని విడుదల ఆపవద్దని, అనుకున్న సమయానికే విడుదల చేయాలని తేజు కోరడంతో అక్టోబర్ 1న థియేటర్లలోకి రానుంది రిపబ్లిక్. ఈలోపు ఇండస్ట్రీలోని సెలెబ్రిటీల కోసం స్పెషల్ స్క్రీనింగ్ లు వేస్తున్నారు. నాచురల్ స్టార్ నానీ ‘రిపబ్లిక్’ మూవీని చూశారు. ఆ సినిమా చూశాక ట్విట్టర్ వేదికగా స్పందించారు. సాయిధరమ్ తేజ్ వ్యక్తిత్వాన్ని, సినిమాను సైతం కలిపి పొగిడేశారు. 


‘సాయిధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్నవారి పట్ల చూపించే ప్రేమాభిమానాలు, తిరిగి ఆయనకు అభిమానుల ప్రార్థనల రూపంలో చేరాయి. ఇప్పుడు మరింత బలంగా రిపబ్లిక్ సినిమా రూపంలో రాబోతున్నాయి. ఇది దర్శకుడు దేవాకట్టా తిరిగి ఫామ్ లోకి వచ్చాడని చెప్పడానికి ఈ సినిమా ఒక అనౌన్స్ మెంట్. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రిపబ్లిక్ టీమ్ కు ఆనందాన్ని కలిగించింది. 


రిపబ్లిక్ ట్రైలర్ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తేజూ రాజీకయ వ్యవస్థతో యుద్ధం చేసే కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. భగవాన్-పుల్లారావు కలిసి సినిమాను నిర్మించారు. ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: ఈ ప్రత్యేక దినం పుట్టి ఇంకా అయిదేళ్లే... ఇంతకీ ఏంటి దీని స్పెషాలిటీ


Also read: గుండె పంపించే వార్నింగ్ సైన్ లను గమనిస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే


Also read: సర్జరీ సమయంలో ఏడవకండి... దానికి కూడా బిల్లేస్తారు, ఆ దేశంలో ఇదో కొత్త పద్ధతి


Also read: అడవిలో దివి అందాలు... అభిమానులకు పండగే


Also read: అందమంతా ఆమె కళ్లలోనే... బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి క్యూట్ పిక్స్