టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న హీరో ఎవరంటే బాలకృష్ణ అంటున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ ఎంట్రీతో హడావుడి ఓ రేంజ్ లో జరుగుతోంది. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న  యాక్షన్ డ్రామా “అఖండ” ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇందులో  ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్,  శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా  నైజాం రైట్స్  కోసం దిల్ రాజు రూ.19 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీస్ లెజెండ్, సింహా తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో కావడంతో 'అఖండ' పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుంగా ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైలన లుక్, టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. అఘోరా గా బాలయ్య విశ్వరూపం చూపిస్తాడని ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే తన తదుపరి సినిమా కోసం కూడా నటసింహం క్రేజీ క్యారెక్టర్లో కనిపిస్తారని టాక్. 
Also Read:  4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో డ్యూయెల్ రోల్ చేయబోతున్న నటసింహం ఒక పాత్రలో స్వామీజీగా కనిపించనున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇందులో  బాలయ్య సరసన త్రిష హీరోయిన్ అని తెలుస్తోంది. గోపీచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో, క్రాక్ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
Also Read: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!
వెండితెర సంగతి పక్కనపెడితే బాలయ్య తొలిసారిగా  బిగ్ స్క్రీన్ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై  తొలి అడుగు వేశారు. ఆహాలో 'అన్ స్టాబబుల్' అంటూ ఓక టాక్ షో  చేయనున్నారు. దీనికి సంబంధించి ఎపిసోడ్ కి రూ.40 లక్షలు చొప్పున  మొత్తం 12 ఎపిసోడ్స్ గా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే దాదాపు రూ.5 కోట్లు  రెమ్యునరేషన్ దక్కుతుందని  లెక్కలేస్తున్నారు. వాస్తవానికి ఓ సినిమా చేయాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది  పడుతుంది. అదే టాక్ షో అయితే మూడు నెలల్లో ముగుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే బాలయ్యకి మంచి పారితోషికం అన్నట్టే లెక్క. పైగా నందమూరి నటసింహం ఇప్పటివరకూ ఏ సినిమాకు ఐదారుకోట్లకు మించి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ టాక్ షో తో మంచి రెమ్యునరేషన్ రావడంతో ఇక సినిమాలకు సంబంధించి కూడా  బాలకృష్ణ దాదాపు పదికోట్లు దాటి తీసుకుంటారేమో అంటున్నారు.  న‌వంబ‌ర్ 4 నుంచి ప్ర‌సారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌న్నది  ఆస‌క్తిగా మారింది.  ఈ షోలో చిరంజీవి, రామ్ చరణ్ తో కలసి పాల్గొంటారని , ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని, నాగార్జున కూడా చైతూ, అఖిల్ తో కలసి షో లో పార్టిసి పేట్ చేయనున్నారని అంటున్నారు. ఓవరాల్ గా బాలకృష్ణ వెండితెర, ఓటీటీలో మాంచి జోరుమీదున్నారన్నమాట.
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
Also Read: ఇన్ స్టాలో ఫుడ్ ఫోటోలు షేర్ చేసే వారికి ఓ హెచ్చరిక... బరువు పెరుగుతారు జాగ్రత్త
Also Read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి