అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది 'బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వచ్చే నెలలో ఆయన నటించిన 'థాంక్యూ' సినిమా విడుదల కానుంది. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. చైతు తన నెక్స్ట్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో చేస్తారని వార్తలొచ్చాయి. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ సమయంలో పరశురామ్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. 


చాలా కాలంగా చైతు హీరోగా వెంకట్ ప్రభు ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొన్నామధ్య ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా వెల్లడించారు. వెంకట్ ప్రభు తీసిన 'మానాడు' సినిమాను తెలుగులో చైతుతో రీమేక్ చేస్తారంటూ కథనాలను ప్రచురించారు. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అని తెలుస్తోంది. కానీ 'మానాడు' రీమేక్ కాదని తెలుస్తోంది. వెంకట్ ప్రభు కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది.


గురువారం నాడు(జూన్ 23) ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. 'బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది.. మీ ఎగ్జైట్మెంట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నాం' అంటూ ఫైల్ తో ఉన్న ఓ పోస్టర్ ను వదిలారు. నాగచైతన్య కెరీర్ లో 22వ సినిమాగా ఇది రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఇందులో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో!


Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా


Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు