మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇదివరకు చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. చిరంజీవి-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతోంది. ఇందులో రవితేజ(Raviteja) కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే మరోపక్క బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. 


గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుందని ప్రకరించారు. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం సహజమే కానీ ఈసారి భారీ బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. 'ఆదిపురుష్', వారసుడు' లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఇప్పుడు చిరు, బాలయ్య కూడా తోడైతే థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. 


ఈ సంగతి పక్కన పెడితే.. చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఒకేసారి తమ బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయడమంటే చిన్న విషయం కాదు. నిజానికి బాలయ్య సినిమాను దసరాకి లేదంటే డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. 


చిరు, బాలయ్య సినిమాలను ఒకేరోజు కాకుండా.. రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ చేస్తే మంచిదని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో చర్చించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సినిమాను జనవరి 10న, బాలయ్య సినిమాను జనవరి 12న రిలీజ్ చేసేలా ప్లాన్ వేసుకున్నారట. దీనికి చిరు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. రిలీజ్ కి ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. డేట్ క్లాష్ పై బజ్ ఓ రేంజ్ లో నడుస్తోంది. 


దీపావళికి చిరు సినిమా అప్డేట్:
చిరంజీవి-బాబీ సినిమాలో హీరో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారట. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని ఇటీవల చిరు వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. దీనిపై ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  


బాలయ్య సినిమా విషయానికొస్తే.. దీనికి 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy) టైటిల్ ఖరారు చేశారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ భామ హానీ రోజ్ ఓ పాత్రలో కనిపించనుంది. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్