దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ రియల్ కపుల్స్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి నటించినా.. డ్యాన్స్ చేసినా.. చూడాలని ఆశపడతారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది.. షన్ను (షణ్ముఖ్), బనానా(దీప్తి) కలిసి పనిచేయాలని కోరుతుంటారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వినయ్ షణ్ముఖ్.. వారిద్దరి ‘మలుపు’ వీడియో సాంగ్‌ను రూపొందించాడు. వినాయక చవితి సందర్భంగా యూట్యూబ్‌లో ‘మలుపు’ సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో ఒక మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 


షన్ను ప్రస్తుతం బిగ్‌ బాస్ సీజన్ 5 హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పాట ద్వారా షన్నుకు మరింత మంది సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో షణ్ముఖ్ కూడా ఒకరు. బిగ్ బాస్‌లో చివరికి వరకు ఉండాలంటే.. తప్పకుండా ప్రేక్షకుల మద్దతు ఉండాలి. దీంతో బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా, ఆమె టీమ్.. ప్లాన్ ప్రకారం సరైన సమయంలో ఈ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు.


ఇక సాంగ్ టీజర్‌ను చూస్తే తప్పకుండా గుండె బరువెక్కుతుంది. భావోద్వేగ సన్నివేశాల్లో దీప్తి సునైనా జీవించిందనే చెప్పాలి. ఇందులోని లవ్.. రొమాన్స్‌తోపాటు ఎమోషనల్ సీన్స్ తప్పకుండా ఆకట్టుకుంటాయి. టీజర్ నచ్చేయడంతో అంతా ఇప్పుడు ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 16న యూట్యూబ్‌లో ఈ వీడియోను విడుదల చేయనున్నట్లు టీజర్ ద్వారా తెలిపారు. 


‘మలుపు’ సాంగ్ టీజర్:


దీప్తి, షన్నూ ఎప్పుడూ తాము ప్రేమికులమని చెప్పుకోలేదు. అలాగని ఆ వార్తను ఖండించలేదు కూడా. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటూ.. చక్కని జోడీ అనిపించుకుంటున్నారు. వీరిద్దరు విడిపోయారనే రూమర్లు కూడా బాగానే చక్కర్లు కొట్టాయి. అయితే, బిగ్ బాస్‌కు వచ్చే ముందు ఇద్దరు చాలా క్లోజ్ ఉన్న వీడియోలు చక్కర్లు కొట్టడంతో వారు ఇంకా ప్రేమలోనే ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఈ జంట అభిమానులు ఎలాగైనా సరే.. షణ్ముఖ్‌ను విజేతగా చూడాలని కోరుకుంటున్నారు. గుడ్ లక్ షన్ను. 


Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!


Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ 


Also Read: బిగ్ బాస్.. ఈ లేడీస్‌కు కాస్త పూలు చూపించు.. అబ్బాయిలు క్లాస్, అమ్మాయిలు ఊర మాస్!