‘బిగ్ బాస్’ అంటే అందరికీ ఇష్టమే. అందులో గొడవలను కూడా చాలామంది ఇష్టపడతారు. కానీ, ఆ ఇంట్లోకి ఎంటరైన తర్వాతి రోజు నుంచి అరవీర భయంకరమైన ఇగోలతో రెచ్చిపోతే.. కాస్త అతిగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్-5’ చూస్తున్నవారికి ఇలాగే అనిపిస్తుందట. ఈ షో చూస్తున్న ప్రేక్షకులు, నెటిజనుల అభిప్రాయం ప్రకారం.. బిగ్ బాస్ హౌస్‌లో అమ్మాయిలే ఎక్కువ పోట్లాడుకుంటున్నారు, ఇగోలతో రగిలిపోతున్నారు. వీరి గొడవల మధ్యలో కలుగజేసుకోడానికి మేల్ కంటెస్టెంట్లు సైతం హడలిపోతున్నారు. 



ఆడదానికి ఆడదే శత్రువని మన పెద్దలు చెబుతుండేవారు. అది నిజమే అనిపించేలా బిగ్ బాస్ హౌస్‌లోని మహిళ కంటెస్టెంట్ల తీరు ఉందని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్‌లో ఇప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్స్‌లో ఎక్కువగా అమ్మాయిల గొడవలే కనిపిస్తున్నాయి. ముందుగా.. హమీదా తన ఇంట్లోని పిల్లలు తనని అమ్మా అని పిలుస్తాయని జస్సీకి చెప్పడం.. మీ ఇంట్లో కుక్కలు నిన్ను డాడీ అంటాయా అని కౌంటర్ వేయడం.. ఇందుకు ఆమె అలిగి.. మిగతా సభ్యుల వద్ద దాన్ని పెద్ద ఇష్యూ చేయడం వాగ్వాదానికి దారి తీసింది. ఆ తర్వాత హౌస్‌మేట్స్ అంతా గ్రూపులుగా విడిపోయారు. 



ఇక ఈ హౌస్‌లో ‘అర్జున్ రెడ్డి’ భామ.. లహరీ బిగ్ బాస్ తర్వాత మరో బిగ్ బాస్‌‌లా వ్యవహరిస్తోందని నెటిజనులు అంటున్నారు. కాజల్ అత్యుత్సాహంతో కష్టాలు కొని తెచ్చుకుంటోంది. ఆమెకు ‘బిగ్ బాస్’ గురించి బాగా తెలియడం వల్ల.. ఎప్పుడూ కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుందనే భావన హౌస్ మేట్స్‌లో కలిగింది. ఇదే విషయాన్ని లహరీ ప్రస్తావిస్తూ.. కాజల్‌తో గొడవకు దిగింది. అయితే, లహరీ చిన్న విషయాన్ని తెగే వరకు లాగుతున్నట్లుగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇందుకు హమీదాతో జరిగిన గొడవేనని అంటున్నారు. ఆమెతో లహరీ అనవసరంగా గొడవ పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 



ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే యాని మాస్టర్.. జస్సీపై విరుచుకుపడటం కూడా చర్చనీయమైంది. అలాగే సీరియల్ నటి ఉమా ఆలూ కర్రీ కోసం గొడవ పడుతున్న సమయంలో.. ఆమె బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. స్కూల్‌లో ప్రిన్సిపల్ తరహాలో ఆమె వ్యవహరిస్తోందని అంటున్నారు. ఒక్కోసారి అమ్మాయిల గొడవలను చూస్తుంటే.. చేపల మార్గెట్లో ఉన్నామేమో అనిపిస్తోందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇలా అమ్మాయిలంతా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం.. వీలైనప్పుడు అబ్బాయిలను కూడా టార్గెట్ చేసుకోవడం వంటివి చూస్తుంటే.. అబ్బాయిలు మాత్రం కూల్‌గా తమ పనులు తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. అమ్మాయిల్లో సిరి చాలా బెటర్ అని నెటిజనులు అంటున్నారు. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక కూడా చాలా హూందాగా వ్యవహరిస్తోంది. శ్వేత, ప్రియ, సరయు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, హమీదా, ఆర్జే కాజల్‌లు.. తమని తాము కన్‌ఫ్యూజ్ చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. కొన్ని గొడవలకు కేంద్ర బిందువులు అవుతున్నారు. 



Also Read: ఎంత పనిచేశావ్ హమీదా.. జస్సీకి ఎలిమినేషన్ గండం.. ప్రియాకు కెప్టెన్సీ ఛాన్స్ పాయే!


అయితే.. ఈ సీజన్‌లోనే కాదు.. గత సీజన్లలో కూడా బిగ్ బాస్ హౌస్‌లో అమ్మాయిల మధ్యే గొడవలు ఎక్కువ జరిగేవి. అబ్బాయిలు.. వీలైనంత కూల్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అబ్బాయిలో మానస్, శ్రీరామ చంద్ర, షణ్ముఖ్‌లు కూల్‌గా ఆకట్టుకుంటున్నారు. విజే సన్నీ, రవి కూడా సరదాగా కలిసిపోతూ గేమ్ ప్లాన్‌తో వెళ్తున్నాడు. విశ్వ కూడా వీలైనంత మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. లోబో లేకపోతే.. బిగ్ బాస్ బోర్ కొట్టేదేమో. నటరాజ్ మాస్టర్ పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నాడు. జస్సీ మాత్రం సిరితోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అయితే, బిగ్ బాస్ హౌస్‌లో లేడీస్ మాత్రం చాలా వయొలెంట్‌గా ఉన్నారని.. వారికి కాస్త ‘పువ్వులు’ లేదా కూల్‌గా ఉన్న అబ్బాయిలను చూపించండని నెటిజనులు అంటున్నారు. 



Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!


Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ