26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రలో అడివి శేష్ కనిపించరు. శశికిరణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.

 

మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా పరుగులు తీస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా 'మేజర్' చిత్రబృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఒక గొప్ప వ్యక్తి కథ చెప్పడానికి నాలుగేళ్లు కష్టపడ్డాం అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. ఇందులో సినిమాలో కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ క్లిప్స్ ను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   



ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించాయి. అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.