ఎప్పుడు? మళ్ళీ మహేష్ బాబు సెట్స్‌కు వచ్చేది ఎప్పుడు? ఆయనపై త్రివిక్రమ్ సీన్స్ తీసేది ఎప్పుడు? ఈ ప్రశ్నలకు తెర పడినట్టే. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో ప్రతిష్టాత్మకంగా సినిమా నిర్మిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సమాధానాలు ఇచ్చింది.


జనవరి నుంచి నాన్ స్టాప్‌గా!
జనవరి నుంచి SSMB 28 సెట్స్ మీదకు వెళుతుందని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తామని తెలియజేసింది. చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, హుషారుగా సెట్స్‌లో అడుగు పెడతామని పేర్కొంది. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు యూనిట్ సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ దిగిన ఫోటోలు షేర్ చేశారు.


క్రిస్మస్‌కు ముందు అనుకున్నా...
తొలుత క్రిస్మస్‌కు ముందు ఓ చిన్న షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేశారు. ఐదారు రోజులు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ, మహేష్‌తో లేటెస్ట్ మీటింగ్ తర్వాత మొత్తం ప్లాన్ మారింది. స్మాల్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి, నాన్ స్టాప్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
 
ఈసారి చలో లండన్... 
క్రిస్మస్, న్యూ ఇయర్!
Mahesh Babu New Year Plans : డిసెంబర్ మూడో వారంలో ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు లండన్ టూర్ ప్లాన్ చేశారని తెలిసింది. బహుశా... 22 లేదంటే ఆ తర్వాత రోజు అందరూ విదేశాలకు ప్రయాణం అవుతారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయాల్లో అక్కడే ఉంటారు. 


Also Read : నటి వీణా కపూర్ దారుణ హత్య - తల్లిని చంపి నదిలో పడేసిన కుమారుడు






మహేష్ బాబు ఫ్యామిలీకి ఈ ఏడాది కోలుకోలేని దుఃఖం ఎదురైంది. రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ మరణాలు అందరినీ బాధించాయి. ఆ బాధ నుంచి కోలుకుని ఇటీవల మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు మహేష్. మౌంటెన్ డ్యూ కోసం ఒక యాడ్ షూట్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు పిల్లల కోసం ఫారిన్ టూర్ ప్లాన్ చేశారని తెలిసింది.  


మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులతో పాటు SSMB 28 దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ ఆ మధ్య ముంబైలో స్క్రిప్ట్, మ్యూజిక్ విషయమై డిస్కస్ చేశారు. కథ విషయంలో హీరో, దర్శకుడు మధ్య ఏకాభిప్రాయం కుదరపోవడం కారణంగా షూటింగ్ ఆగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ వార్తలు నిజం కాదని తెలిపాయి. మహేష్ తండ్రి కృష్ణ, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణాల కారణంగా చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది.


ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.