సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు.
 
'కళావతి', 'పెన్నీ సాంగ్', టైటిల్ సాంగ్ అన్నీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సినిమా నుంచి నాల్గో పాటను విడుదల చేయనున్నారు. 'మ.. మ.. మహేషా..' అంటూ సాగే ఈ పాటను రేపు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను వదిలారు దర్శకనిర్మాతలు. ఈ పోస్టర్ మాములుగా లేదు. మహేష్ బాబు, కీర్తి సురేష్ మాస్ డాన్స్ చేస్తూ కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు. 


రేపే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వస్తారో చూడాలి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


Also Read: ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ - ఫొటో వైరల్


Also Read: పాపులర్ నటికి వేధింపులు - దర్శకుడు అరెస్ట్