యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అలానే ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా కమిట్ అయ్యారు ఎన్టీఆర్. ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఎన్టీఆర్-ప్రణతి పెళ్లి రోజు, ప్రశాంత్ నీల్-లిఖిత పెళ్లి రోజు యాదృశ్చికంగా కలిశాయట. దీంతో రెండు ఫ్యామిలీలు కలిసి తమ వెడ్డింగ్ యానివర్సరీను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఎన్టీఆర్. దీంతో ఫ్యాన్స్ రెండు ఫ్యామిలీలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోలు సినిమాలకంటే రిలేషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారని.. వారి హాస్పిటాలిటీ, ఫ్యామిలీతో కలుపుకునే తీరు తనకు బాగా నచ్చుతుందని అన్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ తో తన సినిమా మొదలవ్వకముందే అతడితో ట్రావెల్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఫ్యామిలీలతో కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'సలార్'తో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కిస్తారు.