'ఊ అంటావా మావ... ఊఊ అంటావా?' - 'పుష్ప: ద రైజ్' సినిమాలో హీరో అల్లు అర్జున్‌తో పాటు సమంత స్టెప్స్ వేసిన స్పెషల్ సాంగ్. లిరికల్ వీడియో విడుదల అయిన తర్వాత తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని అంటూ పురుషుల సంఘం నిరసన తెలిపింది. ఓ పక్క నిరసనలు తెలుపుతుంటే... మరో పక్క పాట సూపర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. 'ఊ అంటావా మావ... ఊఊ అంటావా' అంటూ చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఆ జాబితాలో మాధురీ దీక్షిత్ కూడా చేరారు.


'ఊ అంటావా మావ... ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ కూడా రీల్ చేశారు. అయితే... అందరిల్లా ఆమె డాన్స్ చేయలేదు. జస్ట్, ఓ కనుసైగతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఒకప్పుడు ఎన్నో హిట్ సాంగ్స్ చేసిన మాధురీ దీక్షిత్... ఎన్నో హిట్ స్టెప్స్ వేసిన మాధురీ దీక్షిత్... రొమాంటిక్ గా కన్ను కొట్టారు. దానికి సుమారు రెండు లక్షల నలభై వేల లైక్స్ వచ్చాయి. ఇటీవల ఈ పాటకు ప్రగతి కూడా స్టెప్స్ వేశారు. అది పాపులర్ అయ్యింది. హిందీ ప్రేక్షకులు చాలా మంది ఈ పాటకు స్టెప్స్ వేస్తున్నారు. 






Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
Also Read: నా నవ్వు, బలం, ఆశ నువ్వే... కుమార్తె బ‌ర్త్‌డేకు ప్రగతి ఎమోషనల్ పోస్ట్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.