మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. ఇప్పటికే విందులకు ఆహ్వానించి ‘మా’లో సరికొత్త రాజకీయానికి తెరతీశారు. దానిపై ఇంకా చర్చ జరుగుతుండానే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ప్రకటించారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. మెయిన్ ప్యానెల్, ఎగ్జిక్యూటివ్ ప్యానెళ్లను ప్రకటించారు.


సీనియర్ నటి జయసుధ, నటి జీవిత, నటి హేమ అధ్యక్షపదవి  పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించిన ప్రకాశ్ రాజ్... జయసుధను మెయిన్ ప్యానెల్‌లోకి తీసుకోవాలని అనుకున్నామని, కానీ ఆమె అధికార ప్రతినిధిగా ఉంటానని చెప్పారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. జయసుధతోపాటు జీవిత, సాయి కుమార్, బండ్ల గణేశ్, బెనర్జీ అధికార ప్రతినిధులుగా ఉంటారని ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. జీవిత రాజశేఖర్, హేమతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని తెలిపారు. ‘మా’ అసోసియేషన్ మూడు , నాలుగు విభాగాలుగా విడిపోకూడదని చెప్పానన్నారు.  


Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!


ఇక ప్యానెల్ విషయానికొస్తే ప్రగతి, అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్, భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేశ్ కొండేటి, తనీష్, టార్జాన్, రూపాల్, గోవిందరావ్,శ్రీధర్ రావు  సభ్యులుగా ఉన్నారు. ఇక ట్రెజరర్ ఎవరన్న దానికి వస్తే.. నాగినీడుని ఎంపిక చేశామని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆయనకు ప్రసాద్ ల్యాబ్‌ లాంటి మహాసంస్థను నడిపిన అనుభవం వుందని, అకౌంట్స్ గురించి తెలుసునని.. ముక్కుసూటితనం ఉందని నాగినీడును ప్రశంసించారు. 


Also Read: భీమ్లా నాయక్‌ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!


జాయింట్ సెక్రటరీగా అనితా చౌదరిని ప్రకటించారు. మహిళల హక్కుల గురించి ఆమె పోరాడతారని ప్రశంసించారు.  మరో జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్‌ను ప్రకటించిన ప్రకాశ్ రాజ్. నాటక రంగంతో పాటు సినీ రంగంలో ఉత్తేజ్‌కు అపార అనుభవం వుందని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే బెనర్జీని పేరు ప్రకటించారు. ఆయన ఈసీ మెంబర్‌గా, జాయింట్ సెక్రటరీగా మా అసోసియేషన్‌లో పనిచేశారని తెలిపారు. మరో వైస్ ప్రెసిడెంట్‌గా హేమను ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌గా శ్రీకాంత్‌, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌ను ప్రకటించారు. అక్టోబర్ 10న ‘మా’కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ప్రధానంగా పోటీ రెండు ప్యానెళ్ల మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు.


Also Read: గుర్రం చనిపోయిందని డైరెక్టర్‌ మణిరత్నంపై కేసు


Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన