దళపతి విజయ్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా చెలామణి అవుతున్నారు. తెలుగులో కూడా ఆయన సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు మార్కెట్ బాగానే జరుగుతుంటుంది. ఆయన చివరిగా 'మాస్టర్' సినిమాతో అలరించారు. త్వరలోనే 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు. 


నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయినట్లే అన్నారు. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. రష్మికకి బదులుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. తెలుగులో మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 


ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అటు షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు హిందీతో పాటు.. సౌత్ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సీత రోల్ పోషించడానికి అంగీకరించింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు విజయ్ సినిమాలో కనిపించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. 


ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.


Also Read: ఎన్టీఆర్ 8 కిలోల టార్గెట్, కొత్త లుక్ కోసం స్పెషల్ వర్కవుట్


Also Read: 'ఆర్ఆర్ఆర్'పై అలియాభట్ పోస్ట్, రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందా?