దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వందల కోట్లు వసూలు చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె సీత అనే క్యారెక్టర్ లో కనిపించింది. అయితే ఆమె రోల్ కి స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంది. 


మరో హీరోయిన్ ఒలీవియా మోరిస్ తో పోలిస్తే అలియా రోల్ చాలా చిన్నదనే చెప్పాలి. ఎండ్ టైటిల్స్ లో వచ్చే సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆడిపాడింది. తన రోల్ కి సంబంధించి అలియా చాలా ఫీల్ అవుతుందని టాక్. రివ్యూలలో కూడా హీరోయిన్ కి తక్కువ, గెస్ట్ రోల్ కి ఎక్కువ అన్నట్లుగా అలియా రోల్ ఉందని రాసుకొచ్చారు. దీంతో అలియా.. దర్శకుడు రాజమౌళిపై కోపంగా ఉందని.. తనలాంటి ఆర్టిస్ట్ ని కేవలం రెండు, మూడు సన్నివేశాలకు పరిమితం చేశారని బాధపడుతుందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. 


అంతేకాదు.. అలియా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకి సంబంధించిన పోస్ట్ లు డిలీట్ చేసిందని.. అలానే రాజమౌళిని కూడా అన్ ఫాలో చేసిందని.. ఇలా ఒకటా రెండా? రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అలియా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమా కలెక్షన్స్ గురించి పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ లో 'ఆర్ఆర్ఆర్' వంద కోట్లు వసూలు చేసిందంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది అలియా. ఈ ఒక్క పోస్ట్ తో తనపై వస్తోన్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి. 


ఇకనైనా.. అలియాపై ఈ రూమర్లు రావడం తగ్గుతాయేమో చూడాలి. నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పటి నుంచి అలియాభట్ చాలా బిజీగా ఉంది. రెండు రోజుల క్రితం వరకు ఆమె 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ కోసం వారణాసిలోనే ఉంది. దీంతో ఆమెకి 'ఆర్ఆర్ఆర్' సినిమాపై రియాక్ట్ అవ్వడానికి సరైన సమయం దొరకలేదు. ఇప్పుడు సినిమా గురించి ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి!