కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా  సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సెన్సేషన్ క్రియేట్ చేసింది. 


ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది ఈ సినిమా. ఒక్క బాలీవుడ్ లోనే నాలుగు వందల కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికీ చాలా థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ కి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.320 కోట్లు డీల్ వచ్చినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'కేజీఎఫ్2' రైట్స్ ను దక్కించుకుందట. 


'కేజీఎఫ్1' సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇప్పుడు 'కేజీఎఫ్2' హక్కులు కూడా అమెజానే కొనుక్కుందని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. మే 27 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ లు కీలకపాత్రలు పోషించారు.  


Also Read: ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ - ఫొటో వైరల్


Also Read: పాపులర్ నటికి వేధింపులు - దర్శకుడు అరెస్ట్