Karthika Deepam  December 8th  Episode 1530 (కార్తీకదీపం డిసెంబరు 8 ఎపిసోడ్)


శౌర్య గురించి చంద్రమ్మ ఆలోచిస్తుంటుంది. గండా మాటలు కాదనలేక జ్వాలమ్మ ను పంపించడానికి ఒప్పుకున్నాను కానీ జ్వాలమ్మ లేకుండా నేను ఉండగలనా, వాళ్ళ అమ్మ నాన్న ఉండరులే ఏదో పసిది నమ్ముతుంది అనుకున్నాను. కానీ వాళ్ళ అమ్మానాన్నలు ఉన్నారని అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఇంద్రుడు రావడంతో..ఆ దేవుడు రాసిన రాత అంటూ ఏవో చేబుతుంది. కోప్పడిన ఇంద్రుడు..ఈ విషయంలో ఎవ్వరి మాటా వినను..ఆరోజు ఆ తల్లి రోడ్డు మీద అలా పడి ఉండడం చూసి నా గుండె బరువెక్కిపోయింది..ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని మరీ వాళ్లకి జ్వాలమ్మని ఇచ్చేస్తాను అంటుంది. 


హోటల్లో టిఫిన్ తినేందుకు వెళతారు కార్తీక్-దీప. ఇంతలో చారుశీల కాల్ చేసి దీప ఆరోగ్యం గురించి ఆరా తీస్తుంది.  ఒక డాక్టర్ అన్న విషయం నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు అని కార్తీక్ సెటైర్ వేస్తాడు. డాక్టర్ అయితే ఏంటి మరిచిపోవడానికి అని రిప్లై ఇస్తుంది. ఏవో రిపోర్ట్స్ అన్నావ్ పంపించలేదని అడిగితే..వేరే డాక్టర్ తో మాట్లాడాను అనిచెప్పి కవర్ చేస్తుంది చారుశీల. ఆ తర్వాతకాల్ కట్ చేసి.. ఈ వంటలక్కని చూసుకోమని డాక్టర్ బాబుకి జాగ్రత్తలు చెబుతోందని నవ్వుతూ అంటాడు. ఆ తర్వాత దీప కార్తీక్  మధ్య వారణాసి ప్రస్తావన వస్తుంది. అప్పుడు కార్తీక్.. నాకుగతం గుర్తుకురావడానికి కారణం వారణాసి అని చెప్పి... ఆ రోజు రౌడీల నుంచి దీపను కాపాడేందుకు ప్రయత్నించడం, వాళ్ల కారణంగా హాస్పిటల్ పాలవడం గురించి కార్తీక్ చెబుతాడు. అదంతా విని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కోమాలో ఉన్నాడు త్వరలోనే కోలుకుంటాడని ధైర్యం చెబుతాడు కార్తీక్. ఇంతకీ మిమ్మల్ని రాయితో కొట్టిందెవరని దీప అడిగితే.. ఎవరో తెలియదు కానీ ఆ రాయి తగిలాకే గతం గుర్తొచ్చిందని కార్తీక్ అంటాడు.. ఆ రాయి విసిరిన వాళ్లకి దణ్ణం పెట్టుకోవాలి అంటుంది దీప.


Also Read: జైల్లో ఉన్నా తగ్గేదేలే అన్న మోనిత, దీప-కార్తీక్ ని చూసి షాక్ అయిన సౌందర్య, ఆనందరావు


మరోవైపు హిమ..శౌర్యని తల్చుకుని బాధపడుతుంటుంది. అమ్మానాన్న పోడానికి నేనే కారణం అంటున్నావ్ మరోవైపు అమ్మా నాన్నలు బతికే ఉన్నారంటోంది...మరి నాపై కోపం ఎందుకు అని తాతయ్య ఆనందరావుతో చెప్పి బాధపడుతుంది. ఇక్కడకు రావడం ఇష్టం లేక ఓ సాకుగా నన్ను అడ్డం పెట్టుకుంటోందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో సౌందర్య అక్కడకు వచ్చి మోనితపై మండిపడుతుంటుంది...రోషిని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంటే తనకు మతిస్థిమితం లేదని డాక్టర్ సర్టిఫికేట్ సబ్ మిట్ చేసిందని చెబుతుంది. 


నాకు హెల్త్ బాలేదు సరే..మరి మీరెందుకు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు మీకేమయిందని  దీప అడుగుతుంది
కార్తీక్:ఏమిలేదు జనరల్ టెస్ట్ కి ఇచ్చాను 
దీప: నిజం చెప్పండి డాక్టర్ బాబు మీకేం కాలేదు కదా 
కార్తీక్: నాకు ఏమీ కాలేదు దీప నేను బాగానే ఉన్నాను .. అంత చిన్నదానికెందుకు భయపడుతున్నావ్ 
దీప: మీకు ఏమన్నా అయితే మన పిల్లలు అనాధలవుతారు 
కార్తీక్: అయినా ఇంకో అరగంటలో అమ్మానాన్నలని కలుస్తాం..ఆ విషయం గురించి ఆలోచించకుండా ఏవేవో ఆలోచిస్తావేంటి దీప అని కార్తీక్ మాట్లాడుతాడు. ఇద్దరూ హిమను తలుచుకుని ఆనందిస్తారు. 


Also Read: రిషిధార రొమాంటిక్ మూమెంట్స్, దేవయానికి ఝలక్ ఇచ్చిన గౌతమ్!


మరోవైపు శౌర్య ఇంద్రుడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.  నేను వెతుకుతున్నట్లు మా అమ్మ నాన్న కూడా నా కోసం వెతుకుతూ ఉంటారు బాబాయ్ అని అంటుంది. అప్పుడు ఇంద్రుడు నేను నేరుగా పెద్దమ్మ గారి దగ్గరకు వెళ్లి మీ కొడుకు, కోడలు బతికేఉన్నారని చెప్పేస్తాను...అప్పుడు వాళ్లే వెతుకుతారు అనుకుంటాడు.  అదే సమయంలో కార్తీక్,దీప ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు..హిమ పాలు తాగను అని మారాం చేస్తుండడంతో నువ్వు కూడా మీ నాన్న లాగే వాడు కూడా ఇలాగే సతాయించేవాడు అని అంటుంది. అప్పుడే కార్తీక్ మమ్మీ అనడంతో అంతా షాక్ అవుతారు...ఆ తర్వాత ఆనందరపడతారు. మళ్లీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత దీప...శౌర్య గురించి వరుస ప్రశ్నలు వేస్తుంది. 


రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
దీప-కార్తీక్ ఇంటికొచ్చేశారు...శౌర్య మీతో ఎందుకు లేదు..తను ఒక్కతే ఎందుకు ఉంది..శౌర్యని వదిలేసి మీరెందుకు అమెరికా వెళ్లిపోయారని సౌందర్యని వరుస ప్రశ్నలు వేస్తుంది దీప