కన్మణి పాత్రలో నయనతార (#Nayanthara), ఖతీజా పాత్రలో సమంత (#Samantha) నటించిన సినిమా 'కన్మణి రాంబో ఖతీజా'. ఇందులో విజయ్ సేతుపతి హీరో. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ వెర్షన్ టీజర్ శుక్రవారం విడుదల అయ్యింది. తెలుగు టీజ‌ర్‌ (Kanmani Rambo Khatija Telugu Teaser) ను ఈ రోజు (శనివారం) విడుదల చేశారు.


'కన్మణి రాంబో ఖతీజా' సినిమాలో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిన యువకుడిగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కనిపించనున్నారు. ఇద్దరు అమ్మాయిలను ఒకే చోట నిలబెట్టి... ఇద్దరితో మాట్లాడే సన్నివేశంతో టీజర్ ప్రారంభం అయ్యింది.


"మొట్టమొదటిసారి ఏ రోజైతే నీ లవ్ నాతో చెప్పావో... ఆ రోజే నుంచే నా జీవితం అందంగా మారింది" అంటూ సమంతతో విజయ్ సేతుపతి డైలాగ్ చెప్పారు. ఆ తర్వాత "నేను మొదటిసారి కళ్ళు చూసి మాట్లాడిన అమ్మాయి నువ్వే" అంటూ నయనతారతో చెప్పారు. "మైనస్ గా సాగుతున్న నా జీవితం ప్లస్ గా మారింది నీ వల్ల" అంటూ ఎవరికి చెప్పారో తెలియకుండా ఇద్దరినీ క‌న్‌ఫ్యూజ్ చేశారు. ఇద్దరినీ పెళ్లి చేసుకున్నారు. మొదట్లో అంతా హ్యాపీగా ఉన్నప్పటికీ... ఆ తర్వాత  హీరో ఎన్ని తిప్పలు పడ్డాడన్నది సినిమాగా తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరు కావాలని ప్రశ్నించినప్పుడు ఏం సమాధానం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 28 (Kanmani Rambo Khatija Release Date)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: మహేష్ సిగ్నేచర్ స్టెప్ అదిరిందంటున్న ఫ్యాన్స్, 'సర్కారు వారి పాట'లో 'కళావతి' సాంగ్ లీక్
Also Read: 'డీజే టిల్లు' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?