Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టిస్తున్న సినిమా 'పుష్ప - 2 ది రూల్'. సుకుమార్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 15న రిలీజ్ అవుతున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఇప్పుడు రిలీజ్ ని వాయిదా వేశారు. డిసెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్లు ఇటు బ‌న్నీ, అటు సినిమా టీమ్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే, ర‌ష్మిక మాత్రం ఈ విష‌యంలో అసంతృప్తిగా ఉన్నార‌ట. ఎందుకు అంటే? 


'ఛావా' కూడా అదేరోజు.. 


'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ర‌ష్మిక‌. దీంతో ఆమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ సినిమా త‌ర్వాత వ‌రుస అవాకాశాల‌తో దూసుకుపోతోంది. పుష్ప త‌ర్వాత మ‌రో భారీ హిట్ సినిమా 'యానిమల్'. దీంతో ర‌ష్మిక‌కు బాలీవుడ్ లో కూడా విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా ఉంది. విక్కీ కౌశ‌ల్ తో ఆమె న‌టించిన సినిమా 'ఛావా'. ఛ‌త్ర‌ప‌తి శివాజి జీవిత క‌థ ఆధారంగా ఈసినిమా తెర‌కెక్కుతోంది. అయితే, ఆ సినిమా కూడా డిసెంబ‌ర్ 6నే రిలీజ్ అవుతుంద‌ట‌. దీంతో రెండు సినిమాల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని, ఏదో ఒక సినిమాపై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నార‌ట ర‌ష్మిక‌. రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. 'పుష్ప' ఇప్ప‌టికే బాలీవుడ్ ని షేక్ చేయ‌డం, ఛ‌త్ర‌ప‌తి శివాజీ లాంటి ప‌వ‌ర్ ఫుల్ కథ కావ‌డంతో రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి ప్రేక్ష‌కుల్లో. రెండు సినిమాల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని అనుకుంటున్నార‌ట. అయితే బీ టౌన్ లో వినిపిస్తున్న మ‌రో వార్త ఏంటంటే? 'ఛావా' సినిమాని పోస్ట్ పోన్ చేసే యోచ‌న‌లో ఉన్నార‌ట మేక‌ర్స్. 


పోస్ట్ పోన్ కి కార‌ణం ఇదే.. 


'పుష్ప - 2' సినిమా నుంచి రిలీజైన రెండు పాటలు, అల్లు అర్జున్ లుక్ అన్నీ ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా బ‌న్నీ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేశారు చాలామంది. అయితే, ఇప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ప్ర‌క‌టించారు. దానికి కార‌ణం కూడా చెప్పింది మైత్రీ మూవీ మేక‌ర్స్. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంద‌ని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి కూడా టైం ప‌డుతుంద‌ని, క్వాలిటీ సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఉద్దేశంతోనే సినిమా పోస్ట్ పోన్ చేసిన‌ట్లు చెప్పింది. 


సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'పుష్ప' బాక్సాఆఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. అటు నార్త్ లో కూడా ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. 'పుష్ప 2'లో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టికే రిలీజైన రెండు పాట‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. 


Also Read: ల‌గ్జ‌రీ కారు కొన్న 'జ‌బ‌ర్ద‌స్త్' ఆర్టిస్ట్ రీతూ చౌద‌రి.. ధ‌ర తెలిస్తే షాకే!