Aditi Rao Hydari-Siddharth: నటుడు సిద్దార్థ్ తో రిలేషన్ పై హీరోయిన్ అదితి రావు హైదరి స్పందించింది. ఇటీవలి కాలంలో వారిద్దరిపై పుట్టుకొచ్చిన రూమర్స్, వార్తల గురించి ఆమెను అడగగా.. అదితి క్యూట్ రియాక్షన్ ఇచ్చింది. ఆమె సిగ్గుపడుతూ విషయాన్ని దాటవేసింది. తామిద్దరి రిలేషన్ పై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఆమె కేవలం సంజ్ఞలతోనే సమాధానమిచ్చింది. దీన్ని బట్టి చూస్తే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని. ఆ ప్రేమపక్షుల మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. అంటే వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమోనని తమకు తోచిన విధంగా అర్థాలు తీసుకుంటున్నారు.


అప్పట్నుంచే..


గతేడాది నుంచి అదితి రావు, సిద్దార్థ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో మహా సముద్ర అనే సినిమాలో కలిసి నటించారు. అప్పట్నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించినట్టు టాక్ కూడా ఉంది. ఆ తర్వాతే ఈ ఇద్దరి గురించి అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లు సిద్దార్థ్, అదితి పలుమార్లు మీడియాకు కనిపించారు. పార్టీల్లో, పబ్బుల్లో కలిసి తిరిగారు. పలు ఈవెంట్స్, ఫంక్షన్స్ లోనూ కలసి కనిపించారు. దీంతో అప్పటికే వీరిద్దరి రిలేషన్ షిప్ పై క్రియేట్ అయిన రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్టయింది. అంతే కాదు వీరిని చూసిన వారంతా వీరు త్వరతోనే పెళ్లి చేసుకోబోతున్నారనే కామెంట్స్ కూడా చేశారు. అంతేకాదు కొన్ని రోజుల క్రితం సిద్దార్థ్, అదితి రీల్స్ చేస్తూ అలరించారు.


పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దు









ఇక తమ రిలేషన్ షిప్ పై ఇటీవలే అదితి రావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ఎదురైన ప్రశ్నలు ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి. తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడవద్దని ఖరాకండిగా చెప్పేసింది అదితి. వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని ఆమె వెల్లడించింది. తాను ఎవరితో రిలేషన్ పిప్ లో ఉన్నానో అవసరం లేదని, ప్రస్తుతం తాను, చాలా సినిమాల్లో బిజీగా ఉన్నట్లు చెప్పింది. సినిమాల మీదే బాగా ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్న ఆమె.. దయచేసి తన పర్సనల్ విషయాలను పట్టించుకోకపోవడం మంచిదని తేల్చి చెప్పింది. 


ఇక అదితి సినిమా విషయాలకొస్తే ఆమె ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సంజయ్ లీలా భన్సాలీ తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి’లో నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్న ఈ సిరీస్ లో,  పలువురు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు కనిపించి కనువిందు చేశారు. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ మహారాణుల మాదిరిగా దర్శనం ఇచ్చారు.  


Read Also : Pavitra Lokesh: నాకు ఒక శక్తి అండగా ఉంది, కష్టపడి నా కలలు నెరవేర్చుకున్నా: పవిత్ర లోకేష్