టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబీ'. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం తాజాగా(జూలై 14న)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. నేషనల్ అవార్డు అందుకున్న 'కలర్ ఫోటో' మూవీకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వసూళ్ల పరంగానూ దుమ్మురేపుతోంది.  


‘బేబీ’ సక్సెస్ మీట్ లో షాకింగ్ సంఘటన


‘బేబీ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్తో పాటు సినిమా దర్శకుడు, నిర్మాత పాల్గొన్నారు. నటుడు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్టుగా వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా షాకింగ్ ఘటన జరిగింది. ఆడియెన్స్ లో ఉన్న ఓ అభిమాను పరిగెత్తుకుంటూ వచ్చి స్టేజి మీదకు ఎక్కాడు. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ విజయ్ దేవరకొండ కాళ్ల ను టచ్ చేసేందుకు ప్రయత్నించాడు. విజయ్ దేరకొండ భయంతో వణికిపోయాడు. తాను నిలబడిన ప్రదేశం నుంచి పక్కకు పరిగెత్తాడు. వెంటనే భద్రతా సిబ్బంది వచ్చి అతడిని పట్టుకున్నారు. స్టేజి మీది నుంచి కిందకు దించారు.  దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ తర్వాత అభిమానని దగ్గరికి పిలిచి విజయ్ సెల్ఫీలు ఇచ్చారు.










వరుస సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ


ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ కి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ‘ఖుషీ’ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నారు. వాటికి వాటికి తాత్కాలికంగా 'VD 12', 'VD 13' అనే టైటిల్స్ పెట్టారు. ఇక విజయ్ చిరిగా కనిపించిన చిత్రం ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2022లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. విజయ్ 2011లో 'నువ్విలా' చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు.


Read Also: ‘తేరి’ రీమేక్ తో బీ టౌన్ లోకి కీర్తి సురేష్ ఎంట్రీ? వరుణ్ ధావన్‌తో రొమాన్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial