బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నిజానికి వీరి పెళ్లి 2020లోనే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ రణబీర్ తండ్రి రిషి కపూర్ మరణించడం, అలానే కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం కుదిరిందని సమాచారం. ఏప్రిల్ 17న ఈ జంట పెళ్లి చేసుకోబోతుందట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. 


ఈ మధ్యకాలంలో చాలా మంది బాలీవుడ్ తారలు తమ పెళ్లికి సంబంధించి మీడియాను దూరంగా పెడుతున్నారు. ఎలాంటి అప్డేట్ బయటకు చెప్పడం లేదు. ఇప్పుడు అలియా-రణబీర్ కూడా అదే ఫాలో అవుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌ కాకుండా కపూర్ వంశానికి చెందిన పురాతన, వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో వీరి పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 


ఇదిలా ఉండగా.. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. రణబీర్ పెళ్లికి అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారట. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ లతో రణబీర్ కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడిపోయారు. కొన్నాళ్లకు దీపికా.. రణవీర్ ను పెళ్లాడింది. కత్రినా.. రీసెంట్ గానే విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది. 


ఇప్పుడు వీరిద్దరూ రణబీర్-అలియా పెళ్లికి గెస్ట్ లుగా రాబోతున్నారు. వీరితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, షారుఖ్ ఖాన్, అయాన్ ముఖేర్జీ, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, కరణ్ జోహార్ లాంటి వాళ్లు అతిథిలుగా రాబోతున్నారని తెలుస్తోంది. 


Also Read: 'శర్మాజీ న‌మ్‌కీన్‌' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?


Also Read: చిరంజీవితో సినిమా చేయలేదని ఇప్పటికీ బాధపడుతున్నా - ఉపేంద్ర