టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈరోజు(జనవరి 26) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా రవితేజ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


హరీష్ శంకర్ - రవితేజ బాండింగ్


హరిష్ శంకర్ ని ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అనే విషయం అందరికీ తెలుసు. 'షాక్' సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు హరిష్ శంకర్. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా హరీష్ శంకర్ కి 'మిరపకాయ' ద్వారా ఇంకో ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. మిరపకాయతో రవితేజ కి మంచి సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. తాను ఇండస్ట్రీలో దర్శకుడిగా ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు రవితేజ కారణం అంటూ హరీష్ శంకర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. తన సినీ స్థానానికి కారణం రవితేజ అని, ఆయన లేకపోతే ఈ జీవితం లేదని చాలా సందర్భాల్లో ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ప్రస్తుతం రవితేజ తోనే తన లేటెస్ట్ మూవీ చేస్తున్నాడు హరీష్ శంకర్.


రవితేజ బర్త్ డే - ఎమోషనల్ అయిన హరీష్ శంకర్


ఈరోజు రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయనకి విషెస్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆసక్తికర ట్వీట్స్ చేసాడు." నా ఆకలి తీర్చావు..నా ఆనందాన్ని పంచుకున్నావు..నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు..నా ఆశలకి ఆయువు పోశావు' ఇలా నేను ఎంత చెప్పినా.. ఏమి చేసినా తక్కువే..నాకు ఎన్నో జన్మలకు సరిపడేలా ఊపిరి పోసిన నీకు.. జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య' లవ్ యూ ఫరెవర్ అంటూ ఎమోషనల్ ట్వీట్స్ చేశాడు. దీంతో ట్వీట్స్ కాస్త రవితేజ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.


మిస్టర్ బచ్చబ్ గురించి..


రవితేజ - హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా హిందీలో అజయ్ దేవగన్ 'రైడ్' సినిమాకి రీమేక్ గా 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కుతోంది 'రైడ్' మూవీని తన స్టైల్ లో రవితేజ ఇమేజ్ కి తగినట్లుగా కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా  లేటెస్ట్ షెడ్యూల్ ని కర్తెకుడిలో ప్లాన్ చేశారు. సినిమాలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ కోసం మూవీ టీం తాజాగా కరైకుడికి వెళ్ళింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో రవితేజ సరసన బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రామ్ చరణ్ బర్త్ డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన