రుక్మణి నాగలి భుజానికెత్తుకుని పొలం దున్నుతుంటే మేము సాయం చేస్తామని దేవి, చిన్మయి కూడా వస్తారు. వాళ్ళని చూసి మురిసిపోతుంది భాగ్యమ్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బిడ్డ ఏమి రాలేదు. అప్పుడు నా కోసం, సత్య కోసం నాగలి లాగింది, ఇప్పుడు తన బిడ్డ కోసం నాగలి పట్టిందని భాగ్యమ్మ అనుకుంటుంది. మాధవ్ రావడం చూసి వెళ్లిపోదామని కదలబోతుంటే జానకి చైర్ లో నుంచి కింద పడిపోతుంది. వెంటనే మాధవ్, రామూర్తి వచ్చి పైకి లేపుతారు. మాధవ్ తల్లిని పైకి లేపే కంగారులో చేతి కర్ర పక్కన విసిరేసి రావడం రామూర్తి గమనిస్తాడు. చేతి కర్ర అక్కడ ఉంటే నువ్వు ఎలా వచ్చావ్ అని అడుగుతాడు. అమ్మ పడిపోయిందనే కంగారులో చూసుకోలేదు నాన్న అనేసరికి రామూర్తి తీసుకెళ్ళి ఇస్తాడు.


మాధవ్ డ్రామా మొదలుపెడతాడు. అమ్మ నీకు బాగానే ఉంది కదా అని అడుగుతుంటే జానకి మాత్రం కోపంగా మొహం తిప్పేసుకుంటుంది. అమ్మని ఇలా చూడటం చాలా కష్టంగా ఉందని అనేసి మాధవ్ వెళ్ళిపోతాడు. వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో చూశావా జానకి, నువ్వు కింద పడిపోయావు అనగానే వాడిని వాడు మర్చిపోయి నీకు సహాయం చేస్తున్నాడు. వాడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందని అప్పుడు అన్నావ్ ఇప్పటికైనా అర్థం అయ్యిందా నువ్వు వాడిని తప్పుగా అర్థం చేసుకున్నావ్ అని రామూర్తి అంటాడు.


Also Read: తులసి నీకు బాస్ నందుకి వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్- ప్రేమ్ చెంప చెళ్లుమనిపించిన తులసి


రుక్మిణి వాళ్ళు ఉన్న పొలం దగ్గరకి ఆదిత్య వస్తాడు. చిన్మయి ఆనందంగా వెళ్ళి ఆదిత్యని కౌగలించుకుంటుంది, దేవి మాత్రం మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా దేవి నాతో మాట్లాడవా అని ఆదిత్య అడుగుతుంటే దేవి మాత్రం బాధగా ఉంటుంది. రుక్మణి, భాగ్యమ్మ ఎంత చెప్పిన కూడా వినదు. ఆదిత్య వచ్చి పలకరిస్తాడు. నా మీద కోపం పోవాలంటే ఏం చెయ్యాలి చెప్పు అని అడుగుతాడు. అమ్మతో కలిసి నాగలి పట్టి పొలం దున్నితే దేవి కోపం పోతుందని చిన్మయి అనేసరికి ఆదిత్య రంగంలోకి దిగుతాడు. ఆదిత్య, రుక్మిణి నాగలికి కాడెద్దులాగా మారి పొలాన్ని దున్నుతారు. చిన్మయి ఆదిత్యని ఫోన్ అడుగుతుంది. మిమ్మల్ని ఫోటోస్, వీడియో తీస్తానని చెప్తుంది. వీడియోలు, ఫోటోలు వద్దు అని చెప్పినా పిల్లలు మాత్రం తియ్యాలని అనుకుంటారు.


సత్య ఫోటోస్ చూస్తుందని రుక్మిణి టెన్షన్ పడుతుంటే నువ్వేమి కంగారు పడకు అవి నేను డిలీట్ చేస్తానులే అని చెప్తాడు. తన పెనీమిటితో బిడ్డతో పచ్చగా ఉండాల్సిన నా బిడ్డ ఎట్లా అయిపోయిందని భాగ్యమ్మ బాధపడుతుంది. మాధవ్ కోపంగా వచ్చి రాధని పొలానికి ఎందుకు పంపించారని అడుగుతాడు. వెళ్తే తప్పేముంది పైగా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళింది, ఇంట్లో అమ్మని చూసుకోడానికి మనం ఉన్నాం కదా అని రామూర్తి అంటాడు. అది కాదు నాన్న పొలంలో అటు ఇటు తిరిగి కష్టపడటం ఎందుకు అసలే ఇంట్లో అమ్మ పనులు చేస్తూ కష్టపడుతుంది కదా అని మాధవ్ అంటాడు. జానకికి అన్నీ తనే అయి చూసుకుంటుంది అందుకే కాసేపు తిరిగి వస్తుందని నేనే పంపించాను అని రామూర్తి అంటాడు.


Also Read: మాధవ్ ని ప్రశ్నించిన చిన్మయి- పాత రుక్మిణిలా నాగలి భుజానికెత్తిన రాధ


నేను వెళ్ళి తీసుకొస్తానని మాధవ్ అంటే ఎందుకు ఆ అమ్మాయిని ఇది చెయ్యొద్దు అనే అధికారం మనకి లేదు నువ్వు గమ్మున ఉండు తనే వస్తుందని రామూర్తి సీరియస్ గా చెప్తాడు. ‘24 గంటలు మీ అమ్మని మన కన్నా ఎక్కువ చూసుకుంటుంది, అలాంటి అమ్మాయిని బయటకి వెళ్లొద్దని నేను ఎలా అంటాను, తిరిగింది చాలు అని నువ్వు ఎలా అంటావ్. రాధకి ఏ రోజు హద్దులు గీసి అధికారం చెలాయించే పని చెయ్యకు. ఆ అమ్మాయికి మన వల్ల చిన్న బాధ కలిగిన నేను సహించను’ అని కోపంగా చెప్తాడు.