స్పెషల్ సాంగ్స్ చేయడంలో దేవి శ్రీ ప్రసాద్ స్టయిల్ సపరేట్. ఆయన కంపోజ్ చేసిన ఎన్నో ట్యూన్స్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. అటువంటి దేవి శ్రీ ప్రసాద్... ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఆయన పాట ఎక్కడో విన్నట్టుందని, ఓ తమిళ సినిమాలో పాటను కాపీ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప: ద రైజ్'కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్‌లో 'రంగస్థలం' ఫ్లేవర్ ఉందని కొంతమంది కామెంట్ చేశారు. అది పక్కన పెడితే... అల్లు అర్జున్ అభిమానులకు, ప్రేక్షకులకు పాటలు నచ్చాయి. లేటెస్ట్‌గా 'ఊ అంటావా? ఊ ఊ అంటావా?' సాంగ్ రిలీజ్ చేశారు. సమంత స్టెప్పులు వేసిన ఈ స్పెషల్ సాంగ్ కాపీ అనేది నెటిజన్స్ టాక్.





Also Read: మావా... ఊ అంటావా? ఊ ఊ అంటావా? సమంత సాంగ్ వచ్చేసింది. చూశారా?
తమిళ హీరో సూర్య నటించిన 'వీడోక్కడే' సినిమా ఉంది కదా! అందులో 'హానీ హానీ...' అని ఓ స్పెషల్ సాంగ్ ఉంది. దానిని దేవి శ్రీ ప్రసాద్ కాపీ చేశాడనేది నెటిజన్స్ కామెంట్. ఆ పాట, ఈ పాట సేమ్ ఉన్నాయని అంటున్నారు. ఈ కాపీ కామెంట్స్ మీద దేవి శ్రీ ప్రసాద్, 'పుష్ప' టీమ్ ఎలా స్పందిస్తాయో చూడాలి.









'పుష్ప'లో 'ఊ అంటావా...' సాంగ్:




'వీడోక్కడే'లో 'హానీ హానీ...' సాంగ్:

Also Read: 'న‌యీం డైరీస్‌'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
Also Read: హమ్మయ్య.. ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీలపై అనుష్క కొంటె కామెంట్స్
Also Read: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
Also Read: షన్నును ఇంప్రెస్ చేయమంటే హగ్గిచ్చిన సిరి... ‘అయిపాయ్’ అంటూ కాజల్ కామెంట్, కామెడీతో ఇరగదీసిన హౌస్ మేట్స్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి