సౌత్  సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ నయనతార. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె పెట్టింది పేరుగా చెప్పుగా చెప్పుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల విషయాలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. కథ నచ్చితేనే సినిమా చేసేందుకు ఓకే చెప్తోంది. కొద్ది రోజుల కిందటే సరోగసీ ద్వారా ఇద్దరు కవలను పొందారు. అటు రౌడీ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు.


యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెలుగులోకి ‘కనెక్ట్’ మూవీ


ఈ నేపథ్యంలోనే సొంత బ్యానర్‌ లో నయనతార మెయిన్ లీడ్ లో ఓ సినిమా చేస్తోంది. హార్రర్ కథాంశంతో ‘కనెక్ట్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో విడుదల అవుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన టీజర్ ను షేర్ చేసింది.





 ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా కొత్త ప్రయోగం


ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఇప్పటికే పూర్తయ్యింది. U/A సర్టిఫికేట్ పొందింది. హార్రర్ సీన్లు సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే, మొత్తం సినిమా రన్ టైమ్ 99 నిమిషాలు. అయితే, ఇందులో బ్రేక్ ఉండదట. తొలిసారి ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఓ ప్రయోగం చేయబోతున్నట్లు విఘ్నేష్ శివన్ వెల్లడించారు. 


అశ్విన్ తో నయనతార రెండో సినిమా


అటు అశ్విన్ తో కలిసి నయనతార రెండోసారి సినిమా చేస్తోంది. 2015లో అతడితో కలిసి ‘మాయ’ అనే సినిమా చేసింది. మళ్లీ ఇప్పుడు ‘కనెక్ట్’ సినిమాతో కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హనియా నఫీస్  కీ రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ టాప్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ‘కనెక్ట్’ సినిమా ద్వారా కోలీవుడ్‌ లోకి అడుగు పెడుతున్నారు.


Read Also: అట్టహాసంగా హన్సిక వివాహ వేడుక, సోహెల్‌తో ఏడడుగులు