‘Vazhakku’ Director Releases Movie Online: మలయాళీ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించిన ‘వళక్కు’ మూవీ విషయంలో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హీరోతో గొడవల కారణంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కాదని భావించిన ఆయన, నేరుగా ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చంటూ లింక్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఇంతకీ హీరో, దర్శకుడి మధ్య గొడవ ఏంటంటే?


‘వళక్కు’ సినిమా విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 2021లోనే కంప్లీట్ అయ్యింది. ఆ సమయంలో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యం ఆయన తాజాగా ఈ సినిమా ఆన్ లైన్ లో విడుదల చేశారు. వీమియో అనే వీడియో ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకులు ఫ్రీగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది ఈ సినిమాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’లో స్క్రీనింగ్ చేశారు. విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి. అయితే, హీరో, దర్శకుడి మధ్య గొడవల కారణంగా ఈ సినిమా థియేటర్లలోకి రాలేదు.


హీరో టొవినోపై దర్శకుడు శశిధరన్ ఆరోపణలు


‘వజక్కు’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ ఒప్పుకోలేదని దర్శకుడు ఆరోపించారు. ఈ సినిమా కారణంగా తన కెరీర్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే కారణంతో ఈ మూవీ విడుదల కాకుండా అడ్డుకుంటున్నాడని వెల్లడించారు. థియేటర్లలోనే కాదు, ఓటీటీలో రిలీజ్ కాకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. 2021లోనే ఈ సినిమా కంప్లీట్ అయినా, ఇప్పటి వరకు సినిమా విడుదలకు కాకుండా చేశాడని ఆరోపించారు. 


దర్శకుడి విమర్శలపై వివరణ ఇచ్చిన టొవినో


దర్శకుడు శశిధరన్ చేసిన ఆరోపణలపై హీరో టొవినో థామస్ వివరణ ఇచ్చారు. ఈ సినిమా కోసం తాను చాలా డబ్బును ఖర్చు చేశానని, నయా పైసా కూడా వెనక్కి రాలేదని చెప్పారు. ఈ మూవీ విషయంలో శశిధరన్ వ్యవహార శైలి కారణంగానే విడుదల కాలేదని ఆరోపించారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివ్ లో ఈ సినిమా స్క్రీనింగ్ చేసే అవకాశం లభించినా దర్శకుడు ఒప్పుకోలేదని ఆరోపించారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల చేసేందుకు అవరమయ్యే క్రియేటివ్ రైట్స్ ను కూడా శశిధరన్ ఇవ్వలేదన్నారు.  


ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదో తెలుసుకోండి- శశిధరన్


టొవినో థామస్ వివరణ నేపథ్యంలో ఈ సినిమాను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి.. ప్రేక్షకులు ఫ్రీగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు శశిధరన్. ఈ సినిమాను ఎవరైనా చూడవచ్చు అంటూ సోషల్ మీడియాలో లింక్ షేర్ చేశారు. ఈ మూవీని చూస్తే ఎందుకు విడుదల కాలేదో ప్రేక్షకులకు అర్థం అవుతుందని వెల్లడించారు. ఈ సినిమాలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.   


Read Also: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?