తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త స్టార్ కపుల్ ఎవరు? ముందుగా ప్రేక్షకులు అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), సొట్టబుగ్గల అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi). నవంబర్ 1న వీళ్ళిద్దరూ ఇటలీలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు ఈ జంట డెహ్రాడూన్ ప్రయాణం అయ్యింది. 


అత్తారింటికి వెళ్ళిన వరుణ్ తేజ్
లావణ్యా త్రిపాఠి ఉత్తరప్రదేశ్ అమ్మాయి. అయితే... ఆమె చిన్నతనంలో ఫ్యామిలీ అంతా ఉత్తరాఖండ్ షిఫ్ట్ అయ్యింది. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ (Dehradun)లో లావణ్య త్రిపాఠి చదువు సాగింది. హిందీ సీరియల్, తెలుగు సినిమాల్లో నాయికగా ఆమె బిజీ అయ్యారు. హైదరాబాద్ సిటీలో ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు. అయితే... వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇంకా డెహ్రాడూన్ సిటీలో ఉంది. పెళ్లి తర్వాత తొలిసారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట అక్కడికి వెళుతోంది. 


బుధవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి దంపతులు కనిపించారు. వారి వెంట మెగా డాటర్ నిహారికా కొణిదెల కూడా ఉన్నారు. అత్తారింటికి వెళుతున్న వరుణ్ తేజ్... అక్కడి అతిథి మర్యాదలు స్వీకరించి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సొంతూరు రానున్నారు. 


Also Read నేను అడిగితే బన్నీ చరణ్ సినిమాలు చేస్తారు - స్వాతి రెడ్డి గునుపాటి






'ఆపరేషన్ వేలంటైన్'తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు
Varun Tej Upcoming Movie : పెళ్లి తర్వాత విడుదల కానున్న వరుణ్ తేజ్ మొదటి సినిమా 'ఆపరేషన్ వేలంటైన్'. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమది. అందులో మానుషీ చిల్లర్ హీరోయిన్. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడు అయ్యాయని తెలిసింది. అది కాకుండా 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా'  సినిమా చేయడానికి వరుణ్ తేజ్ అంగీకరించారు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 


లావణ్యా త్రిపాఠి యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందుతోన్న వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. అందులో ఆమెకు జోడీగా 'బిగ్ బాస్' అభిజీత్ నటిస్తున్నారు. ఇంకా ఓ తమిళ సినిమా కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?



ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి వివాహానికి 120 మంది అతిథులు హాజరైనట్లు తెలిసింది. ఇరు కుటుంబాలు, బంధు మిత్రులతో పాటు చిత్రసీమ నుంచి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు & అల్లు అర్జున్ స్నేహా రెడ్డి దంపతులు ఆ వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, సుస్మితా కొణిదెల, నిహారిక... మెగా కజిన్స్ అందరూ పెళ్లిలో సందడి చేశారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ సిటీలో చిత్రసీమ ప్రముఖులు, అభిమానుల కోసం నవంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.