పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్' కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా 'KGF' సిరీస్ తో 'సలార్'కి లింక్ ఉందని, సలార్ రెండు భాగాలుగా రాబోతుందని అంతేకాకుండా ‘సలార్’లో కేజీఎఫ్ హీరో యశ్ కూడా ఉంటాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలతో సినిమాపై ఉన్న అంచనాలు సైతం పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే 'సలార్' నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫాన్స్ మూవీ యూనిట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా త్వరలోనే సలార్ టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ దానిపై ఇప్పటివరకు అఫీషియల్ అప్డేట్ రాలేదు.


నిజానికి ‘సలార్’ టీజర్ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ ‘ఆదిపురుష్’ వల్ల టీజర్ ని ముందే రిలీజ్ చేయలేదు. ఇక ‘ఆదిపురుష్’ రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే, ఈ మూవీపై వస్తున్న విమర్శలు ప్రభాస్ ఫ్యాన్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ మూవీ టీజర్ రిలీజ్ ద్వారా ఉపశమనం కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 


లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్స్ ప్రకారం రాబోయే రెండు వారాల్లో ‘సలార్’ టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఈ న్యూస్ తో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న సలార్ సెప్టెంబర్ 28, 2023న విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.


కాగా ఇప్పటికే సలార్ పై ప్రేక్షకుల్లోనూ అటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 'కే జి ఎఫ్' సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్గా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంథ్ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్ ని ఎలా చూపించాడో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాల్లో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, భువన గౌడ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. KGF సిరీస్ ని నిర్మించిన హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. శృతిహాసన్ ఈ మూవీలో జర్నలిస్ట్ ఆద్య పాత్రలో నటిస్తుండగా, సుకుమారన్ వరదరాజమన్నార్, జగపతిబాబు రాజ్ మన్నార్ పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి విజయ్ కిరగందుర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!