Super Star Krishna Death Live Updates: గచ్చిబౌలి స్టేడియం కార్యక్రమం రద్దు - అభిమానుల కోసం రేపు పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థీవ దేహం

Advertisement

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. భువి నుంచి దివికి మరో తార వెళ్ళింది.

ABP Desam Last Updated: 15 Nov 2022 06:21 PM
గచ్చిబౌలి స్టేడియం కార్యక్రమం రద్దు - అభిమానుల కోసం రేపు పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థీవ దేహం

అభిమానుల సందర్శనార్థం బుధవారం కృష్ణ పార్థీవ దేహాన్ని గచ్చీబౌలీ స్టేడియానికి తరలించాలని తొలుత భావించారు. ఇందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం ఉదయం 9 నుంచి 12:30 వరకు పద్మాలయ స్టూడియో వద్ద పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నామని వెల్లడించారు. మంగళవారం సూర్యాస్తమయం కావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

Continues below advertisement
Minister KTR: సూపర్ స్టార్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం

తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

Background

తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ఇకలేరు. ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. 


తొలుత గుండెపోటు...
తర్వాత ఆర్గాన్స్ ఫెయిల్యూర్!
Krishna Death Reason : కృష్ణకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. వయసు రీత్యా ప్రతి మనిషి ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావడం సహజమే. కృష్ణకూ ఆ విధమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అందువల్ల, అభిమానులు ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు.
 
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటికీ... ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారింది. వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ సదుపాయాలతో ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ... ప్రయోజనం దక్కలేదు. కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.


శోకసంద్రంలో
ఘట్టమనేని కుటుంబం
కుటుంబానికి పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 
ఈ ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు రమేష్ బాబు, సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించారు. ఇప్పుడు కృష్ణ కన్ను మూశారు. ఒక్క ఏడాదిలో తమకు ఎంతో ఆప్తులైన ముగ్గురు లోకాన్ని విడిచి వెళ్ళడం... మూడు విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు (Mahesh Babu), ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదని తెలుస్తోంది.


అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవ దేహాన్ని నేడు ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ మరణంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  


అభిమానుల సందర్శనార్థం బుధవారం కృష్ణ పార్థీవ దేహాన్ని గచ్చీబౌలీ స్టేడియానికి తరలించాలని తొలుత భావించారు. ఇందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం ఉదయం 9 నుంచి 12:30 వరకు పద్మాలయ స్టూడియో వద్ద పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నామని వెల్లడించారు. మంగళవారం సూర్యాస్తమయం కావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 



Also Read : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ


© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.