Sunny Leone Insta Post : బాలీవుడ్ నటి సన్నీలియోన్​కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. ఈమధ్య కాలంలో పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్​గా ఉంటూ నచ్చిన అంశాలపై స్పందిస్తూ ఉంటుంది సన్నీ. ఇదిలా ఉంటే సన్నీలియోన్ మరోసారి తన మంచి మనసు చాటుకుంది. ముంబైకి చెందిన ఓ చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ప్రత్యేకంగా తానే స్వయంగా 50 వేల రూపాయలు రివార్డ్ ఇస్తానని తెలిపింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టాగ్రామ్​లో పంచుకుంది. దీంతో సన్నీ లియోన్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.


డీటెయిల్స్​లోకి వెళ్తే.. సన్నీలియోన్ తన ఫ్యామిలీతో ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. తన ఇంట్లో కిరణ్ మోరే అనే వ్యక్తి పని చేస్తున్నారు. అతనికి అనుష్క అనే తొమ్మిదేళ్ల కూతురు ఉంది. ఈనెల 8వ తేదీ సాయంత్రం ఏడు గంటల సమయంలో ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో అనుష్క తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఎవరైనా బాలిక ఆచూకీ తెలిపితే 11,000 రూపాయలు పారితోషకం ఇస్తామని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంట్లో పని చేసిన వ్యక్తి కూతురు తప్పిపోయిందనే విషయం తెలుసుకున్న సన్నీలియోన్ స్వయంగా ఆ చిన్నారి కోసం తన మంచి మనసును చాటుకుంది.


ఈ మేరకు బాలిక సమాచారాన్ని ఇచ్చిన వారికి తానే స్వయంగా 50 వేల రూపాయలు ఇస్తానని సన్నీలియోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్​లో షేర్ చేస్తూ ఆ బాలిక ఫోటోతో పాటు చిరునామా, ఫోన్ నెంబర్ తదితర వివరాలను షేర్ చేసింది. దీంతో సన్నిలియోన్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ 'దేవుడా ఎలాగైనా ఆ బాలికను రక్షించు' అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే సన్నీలియోన్ మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా చిన్నారి అనుష్క తల్లిదండ్రులు సుమారు రెండు రోజులుగా ఆమెను వెతుకుతున్నారు.


ఇప్పటివరకు అనుష్క ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తమ కూతురికి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సన్నీలియోన్ ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకోవడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు. ఇక సన్నీ లియోన్ విషయానికొస్తే.. అనుకోకుండా పోర్న్ స్టార్​గా మారి.. 2011 లో హిందీ బిగ్ బాస్​లో పాల్గొన్నది. ఆ తర్వాత ఆమెకు విపరీతమైన పాపులారిటీ రావడంతో ఆమెకు బాలీవుడ్లో మంచి అవకాశాలు వచ్చాయి. సినిమాలతో పాటు బాలీవుడ్​లో పలు ఐటమ్ సాంగ్స్​తో భారీ క్రేజ్ తెచ్చుకున్న సన్నిలియోన్ ఈ మధ్యకాలంలో తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ టైమ్స్​లో మంచు విష్ణు సరసన 'జిన్నా' మూవీలో నటించి ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్లో సన్నిలియోన్ చివరిసారిగా అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన 'కెనడీ' మూవీలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్​తో పాటు సౌత్ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.


Also Read : గౌతమ్​కి థ్యాంక్స్ చెప్పిన యావర్ అన్నయ్య - అమ్మ ప్రేమ తెలియదంటూ ఏడ్చేసిన అన్నదమ్ములు, ఓదార్చిన శివాజీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial