Sanjay Kapoor: బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ క‌పూర్. ఎన్నో సినిమాలు చేశారు. అయితే, సినిమా ఫీల్డ్ లో మాత్రం అంత‌లా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయారు. క‌పూర్స్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చినప్ప‌టికీ స‌రైన సినిమాలు చేయాలేక‌పోయారు. 1995 నుంచి సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌టికీ దాదాపు అన్ని మిస్ ఫైర్ అయ్యాయి. దీంతో ఆయ‌న చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో త‌న అన్న‌, ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. 


క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ప‌ట్టించుకోలేదు.. 


త‌న అన్న బోనీ క‌పూర్ త‌న‌ని ప‌ట్టించుకోలేద‌ని, క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు కూడా త‌న‌కు ఎలాంటి ఆఫ‌ర్స్ ఇచ్చి ఆదుకోలేద‌ని చెప్పుకొచ్చాడు. “బోనీ క‌పూర్ నా అన్న‌.. నేను క‌ష్టాల్లో ఉన్నా కూడా నాకు ఆఫ‌ర్లు ఇవ్వ‌లేదు. నాకు ఎక్క‌డా అవ‌కాశాలు లేన‌ప్పుడు 'నో ఎంట్రీలో' ఫ‌ర్దీ ఖాన్ లాంటి వాళ్ల‌ను కాకుండా నాకు ఛాన్స్ ఇవ్వొచ్చు. కానీ, నాకు అలా ఇవ్వ‌లేదు. అప్ప‌టికే ఆ సినిమాలో స‌ల్మాన్ ఖాన్, అనిల్ క‌పూర్ ఇద్ద‌రూ ఉన్నారు. వాళ్ల వ‌ల్ల సినిమా బాగానే ఆడేది. కాబ‌ట్టి న‌న్ను సినిమాలో పెట్టుకోవ‌చ్చు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ఆయ‌న ఫ‌ర్దీన్ ని తీసుకున్నారు. ఎందుకంటే అత‌ను నా కంటే మంచి ఫామ్ లో ఉన్నాడు అప్పుడు. 20 ఏళ్లుగా నేను నా అన్న ప్రొడక్ష‌న్ లో ప‌ని చేయ‌లేదు. నేను సినిమాలు ప్రొడ్యూస్ చేసి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా న‌న్ను ప‌ట్టించుకోలేదు. ఏదేమైనా చివ‌రికి అది ఒక బిజినెస్ క‌దా మ‌రి”  అని చెప్పారు సంజయ్ క‌పూర్. 


'నో ఎంట్రీ' సినిమాకి సీక్వెల్ ని ఇటీవ‌ల అనౌన్స్ చేశారు బోనీక‌పూర్. ఆసినిమాలో వ‌రుణ్ దావ‌న్, దిల్జిత్, అర్జున్ క‌పూర్ న‌టిస్తున్నారు. ఒరిజ‌న‌ల్ కాస్ట్ ని వీళ్ల‌తో రీప్లేస్ చేశారు. దీంతో అనిల్ క‌పూర్ ఫీల్ అయిన‌ట్లు చెప్పుకొచ్చారు. 


"నేను 'నో ఎంట్రీ' సీక్వెల్ గురించి మా అన్న అనిల్ కి చెప్పేకంటే ముందే దానికి సంబంధించిన విష‌యాలు లీక్ అయ్యాయి. ఆయ‌న నో ఎంట్రీ సీక్వెల్ లో భాగ‌స్వామి అవ్వాలి అనుకున్నారు. కానీ, అక్క‌డ స్పేస్ లేదు. నేను అలా ఎందుకు చేశానో, ఏం చేశానో చెప్పాల‌నుకున్నాను కానీ, అప్ప‌టికే నా మీద కోపంగా ఉన్నారు. వ‌రుణ్, అర్జున్ ఇద్ద‌రు మంచి ఫ్రెండ్స్. వాళ్ల కెమిస్ట్రీ స్టోరీకి బాగా ప‌నికొస్తుంది. దిల్జిత్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే, ఆ పెయిర్‌ను తీసుకురావాలి అనుకున్నాను. కానీ, దాన్ని మా అన్న అపార్ధం చేసుకున్నాడు. త్వ‌ర‌లోనే ఈ ఇబ్బందుల‌న్నీ స‌మ‌సి పోతాయి అనుకుంటున్నాను" అన్నాడు సంజ‌య్ క‌పూర్. 


ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్, సంజ‌య్ క‌పూర్ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. కాగా.. సంజ‌య్‌ను బోనీ 1995లో ప్రేమ్ అనే సినిమాతో లాంచ్ చేశారు. అయితే సంజ‌య్ బాలీవుడ్ లో అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయారు. ఆయ‌న చేసిన సినిమాలు దాదాపు మిస్ ఫైర్ అయ్యాయి.


Also Read: తెలుగులో ఫ్లాప్ - త‌మిళంలో బ్లాక్ బస్టర్ - 'అరణ్మనై 4’కు రికార్డు స్థాయిలో కలెక్షన్స్