సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నది సమంతా రూత్ ప్రభు. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, నితిన్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్​ యాక్షన్​ స్పై థ్రిల్లర్​ సిరీస్​ ‘సిటాడెల్’​ కు ఇది ఇండియన్ వెర్షన్ గా రూపొందింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అద్భుత విజయం తర్వాత సమంత నటిస్తున్న వెబ్ సిరీస్ కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.


సల్మాన్ మూవీలో హీరోయిన్ గా సమంత!


తాజాగా సమంతకు సంబంధించి మరో కీలక వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతోంది. త్వరలో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కండల వీరుడు సల్మాన్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తో 'పంజా', అజిత్ కుమార్ తో 'బిల్లా' సినిమాలు తెరకెక్కించిన విష్ణువర్దన్, 'షేర్షా'  చిత్రంతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఆయన సల్మాన్ ఖాన్ తో కలిసి ‘టైగర్3’ తెరకెక్కించబోతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. 


త్రిష, అనుష్క పేర్లనూ పరిశీలిస్తున్న మేకర్స్


‘టైగర్3’ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపికలో చిత్రబృందం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సౌత్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా సమంతను హీరోయిన్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది? అని చర్చించుకుంటున్నారట. సమంతతో చిత్రబృందం సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అటు సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా అనుష్క శెట్టి, త్రిష కృష్ణన్‌ పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. ఇందులో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఇంకా ఓ క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్​సిరీస్‌తో పాటు ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ పాటతో ఉత్తరాది ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన స‌మంతకు ఈ మూవీ ఛాన్స్ లభించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


‘ఖుషి’ సినిమాలో చివరిసారిగా కనిపించిన సమంత


ఇక సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డీసెంట్ కలెక్షన్స్ తో ఆకట్టుకుంది.  మొదటి రోజే ఈ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, విజయ్ దేవరకొండ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది.


Read Also: అమ్మను, పిల్లలను తిట్టడం తట్టుకోలేకపోయా, అందుకే అక్కడ ఉండొద్దు అనుకున్నా-కరణ్ జోహార్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial