Samantha Admits her Mistakes In The Past: స్టార్‌ హీరోయిన్‌ సమంత గతంలో తప్పు చేశానంటూ ఊహించని కామెంట్స్‌ చేసింది. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు కంగుతిన్న సామ్‌ తాను గతంలో చేసిన తప్పులు తెలియక చేసినని, ఇప్పుడు వాటిని సరిదిద్దుకుంటున్నానంది. ప్రస్తుతం సామ్‌ కామెంట్స్‌ చర్చనీయాంశం అయ్యాయి. కాగా సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత చివరికిగా ఖుషి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ నటించింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది.


 అయితే ఖుషీ రిలీజ్‌ తర్వాత సమంత మయోసైటిస్‌ చికిత్స కోసం లాంగ్‌ బ్రేక్ తీసుకుంది. ఇందుకోసం విదేశాలకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పాడ్ కాస్ట్ వీడియోలు చేస్తూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తోంది. Take 20: Health Podcast నిర్వహిస్తూ, దీనిద్వారా ఆరోగ్య నిపుణులు, ప్రముఖ న్యూట్రిషన్స్‌తో కలిసి చర్చిస్తూ ప్రజలకు సూచనలు ఇస్తుంది. తేకాదు ఆరోగ్యకరమైన ఆహార పద్దతులు, ఆరోగ్య సూత్రాలను కూడా తెలియజేస్తుంది.  ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తుంది. ఈ క్రమంలో సమంత షేర్‌ చేసిన ఓ వీడియోపై ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. "ఇప్పుడు ఇవన్నీ బాగానే చెబుతున్నారు. కానీ గతంలో మీరే కొన్ని అనారోగ్యకరమైన బ్రాండ్స్‌ ప్రమోట్‌ చేశారు" అడగ్గా సమంత దీనికి ఊహించని రిప్లై ఇచ్చింది. 


"అవును.. గతంలో నేను తప్పులు చేశాను. అవి తెలియక చేసినవి. ఇప్పుడు అది తప్పు అని అర్థమైంది. అందుకే అలాంటి బ్రాండ్స్‌ని ప్రమోట్‌ చేయడం ఆపేశాను. ప్రస్తుతం నేను ఏవైతే ఆచరిస్తున్నానో..  వాటి గురించి మాత్రమే చెబుతున్నా. అలాంటి వాటినే ప్రమోట్‌ చేస్తున్నా" అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా మయేసైటిస్‌ బారిన పడినప్పటి నుంచి సమంత ఆరోగ్యంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే రీఎంట్రీ తర్వాత సమంత నిర్మాతగ కూడా మారింది. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థలో సమంత ‘మా బంగారం’ అనే సినిమాను రూపొందిస్తుంది. మరోవైపు రాజ్‌ అండ్‌ డికే కాంబినేషన్‌లో మరో వెబ్‌ సిరీస్‌కి కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది.



కాగా గతంలో సమంత రాజ్‌ అండ్‌ డికే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ నటించింది. ఇందులో ఆమె రాజీ అనే నక్సల్‌ మహిళగా బోల్డ్‌ పాత్ర పోషించింది. డిగ్లామర్‌గా కనిపించిన సమంత పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. మహిళ నక్సలైట్‌గ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రాజ్‌ అండ్‌ డీకే కాంబోలోనే తాజాగా సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఫుల్‌ యాక్షన్‌, థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో ఆమె యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి అదరగొట్టిందని సమాచారం. ఈ వెబ్‌ సిరీస్ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఇది ఇంకా రిలీజ్‌ కాకముందే రాజ్‌ అండ్‌ డీకే కాంబోలోనే సామ్‌ మరో వెబ్‌ సిరీస్‌కి కమిట్‌ అయినట్టు తెలుస్తోంది. 'రక్తబీజ్' అనే యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నారు. ఇందులో సమంతనే లీడ్‌ హీరోయిన్‌గా తీసుకుంటున్నారని సమాచారం. 


Also Read: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!