Sai Dharam Tej About His Financial Status: సాయి ధ‌ర‌మ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన హీరో. చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ఆయ‌న‌. ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే,  య్యూట్యూబ‌ర్, సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయ‌న్స‌ర్ నిఖిల్ తో క‌లిసి చేసిన పాడ్ కాస్ట్ లో ఆయ‌న చాలా విష‌యాలు పంచుకున్నాడు. త‌ను ప‌డ్డ క‌ష్టాలు చెప్పాడు. ఏటీఎం ద‌గ్గ‌ర ఏడ్చేశాను అని అన్నాడు. అమ్మ గొప్ప‌త‌నం లాంటి ఎన్నో విష‌యాలు పంచుకున్నాడు. 


ఏటీఎం ద‌గ్గ‌ర ఏడ్చేశాను.. 


నిఖిల్ చేసి పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎన్నో విష‌యాలు చెప్పారు. దాంట్లో.. "ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మ‌న సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అలా ఎప్పుడైనా జ‌రిగిందా?" అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు సాయి ధ‌ర‌మ్ తేజ్. "2009 అప్పుడే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వ‌స్తున్నాను. 2010లో యాక్టింగ్ కోర్సు అయిపోయి వ‌చ్చాను. 2011-12లో ‘రేస్’ సినిమా ఓపెన్ అయిపోయింది. ఫైనాన్సియ‌ల్ గా చాలా లోగా ఉన్నాను. మీటింగ్ కి వెళ్లాలి. డ‌బ్బులు లేవు. కారులో డీజిల్ కొట్టించాలి. అప్ప‌ట్లో ప్రిపెయిడ్ ఫోన్ దాంట్లో బ్యాలెన్స్ లేదు. పెట్రోల్ కొట్టించాలంటే రూ.500 కావాలి. రూ.450 పెట్రోల్ కొట్టించాలి. రూ.50 తో రీఛార్జ్ చేయించుకోవాలి అనుకున్నాను. పెట్రోల్ కొట్టించాను. రూ.50 డ్రా చేయ‌లేం. మినిమ‌మ్ ఉండాలి. ఎలాగో ట్రై చేశాను. బ్యాలెన్స్ చూస్తే రూ. ల‌క్ష నుంచి రూ.రెండు ల‌క్ష‌లు ఉన్నాయి. అర్థంకాలేదు. వెంట‌నే అమ్మ‌కి ఫోన్ చేశాను. "రాత్రి నువ్వు అన్నావు క‌దా డ‌బ్బులు లేవ‌ని, అందుకే వేశాను. ఈ నెల గ‌డిచిపోతుంది క‌దా" అన్నారు. ఏటిఎం నుంచి బ‌య‌టికి వ‌చ్చి ఏడ్చేశాను. అది అమ్మ ప‌వ‌ర్ అంటే. ఎప్పుడు ఏం ఇవ్వాలో అమ్మ‌కి క‌చ్చితంగా తెలుస్తుంది. అదే అమ్మ గొప్ప‌త‌నం అని  చెప్పాడు సాయిధ‌ర‌మ్ తేజ్.


యాక్సిడెంట్ తర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో న‌టించిన 'బ్రో' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు సాయి ధ‌ర‌మ్ తేజ్. ఇక ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్, సంప‌త్ నంది కాంబినేష‌న్ లో ‘గాంజా శంక‌ర్’తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా టైటిల్ పై వివాదం న‌డుస్తోంది. సినిమా టైటిల్ మార్చాల‌ని మూవీ టీమ్ కి నోటీసులు పంపారు. ఇక ఈ సినిమాని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండ‌గా.. పూజా హెగ్డే ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. 


ఇక ఈ సినిమాకి సంబంధించి సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రీ లుక్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఆ లుక్కులో హీరో మెడ మీద త్రిశూలం, దాని కింద డమరుకం టాటూ ఉంది. అలాగే, చెవికి పోగు కూడా ఉంది. సినిమాలో గంజాయి అమ్మే యువకుడిగా హీరో పాత్ర ఉంటుందని ఫిల్మ్ నగర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అందుకని, ఆ టైటిల్ అని సమాచారం. తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్, యాక్షన్, ఎమోషన్స్ ఇచ్చే కథను సంపత్ నంది రెడీ చేశారట. 


Also Read: నా భర్త నాతో ఉండడు - పాపం వంటలక్కకి రియల్‌ లైఫ్‌లో కూడా కష్టాలే!