Raj Tarun About another Movie with Malvi Malhotra: రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్ర కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా 'తిర‌గ‌బ‌డ‌రా సామీ'. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ జంట‌. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చాలామందికి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా రాజ్ త‌రుణ్ మాల్వీ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆమెతో న‌టించేందుకు త‌ను ఎప్పుడూ రెడీ అంటూ అన్నారు. దీంతో ఆ మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ మాల్వీ మ‌ల్హోత్రకి సంబంధించి కొన్ని విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చిన నేప‌థ్యంలో రాజ్ త‌రుణ్ చెప్పిన ఆ మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. 


మాల్వీకి ఓకే అయితే.. నాకు ఓకే.. 


సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు రాజ్ త‌రుణ్. ఈ సంద‌ర్బంగా హెబ్బా ప‌టేల్ తో త‌న రిలేష‌న్ గురించి, నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు ఆయ‌న‌. హెబ్బ ప‌టేల్ తో త‌న‌కు చాలాసార్లు పెళ్లి చేశార‌ని, చాలాసార్లు సంబంధం అంట‌గ‌ట్టార‌ని చెప్పుకొచ్చాడు. "వాళ్ల ఇష్టం, వాళ్ల‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తారు. కానీ అలాంటిదేమీ లేదు. ఇద్ద‌రం చాలామంచి ఫ్రెండ్స్. ఎందుకో అలా సినిమాలు క‌లిసొచ్చాయి. అప్ప‌ట్లో ట‌చ్ లో ఉన్నాము. ఆమె బిజీ అయిపోయారు ఇంక అలా ట‌చ్ లో లేము. ఈ మ‌ధ్య రంజాన్ కి ఈద్ ముబార‌క్ అని మెసేజ్ చేసింది. థాంక్యూ అన్నాను అంతే త‌ప్ప అలాంటిదేమీ లేదు. 'కుమారీ 24' చేశాము. మంచి హిట్ అయ్యింది. హిట్ కాంబినేష‌న్ క‌దా ఆ త‌ర్వాత 'అంద‌గాడు' చేశాం. చాలా గ్యాప్ వ‌చ్చింది. 'ఒరేయ్ బుజ్జిగాడు' చేశాం. అలా నాలుగు సినిమాలు చేశాం అంతే. ఇక ఇప్పుడు ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు ఛాన్స్ ఇస్తే, ఆమెతో న‌టించాల‌ని అడిగితే క‌చ్చితంగా న‌టిస్తాను. ఇక మాల్వీతో అంటారా? ఆమె ఓకే అంటే నాకు ఓకే ఎప్పుడు చేయ‌డానికైనా అని చెప్పారు రాజ్ త‌రుణ్. 


ఆగ‌స్టు 2న విడుద‌ల‌.. 


'తిర‌గ‌బ‌డ‌రా సామీ' సినిమాని సురక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మకరంద్‌ దేశ్‌పాండే, జాన్‌ విజయ్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగ‌స్టు 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


వివాదం ఇదే.. 


నిజానికి రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్ర‌, లావ‌ణ్య వివాదం కాంట్ర‌వ‌ర్సీ అయిన విష‌యం తెలిసిందే. లావ‌ణ్య అనే యువ‌తి.. రాజ్ త‌రుణ్ త‌న‌ను ప్రేమ పేరుతో న‌మ్మించి మోసం చేశాడ‌ని, మాల్వీ మ‌ల్హోత్రతో రిలేష‌న్ షిప్ లో ఉంటూ త‌న‌ను దూరంగా పెట్టాడ‌ని ఆరోపిస్తూ కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో రాజ్ త‌రుణ్, మాల్వీ ఇద్ద‌రు మీడియా ముందుకు రాలేదు. 'పురుషోత్తముడు' ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ న‌టించిన 'పురుషోత్త‌ముడు' సినిమా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.  అనే సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టికీ రాజ్ త‌రుణ్ ఆ ప్రమోష‌న్స్ లో కూడా పాల్గొన‌లేదు.  కాగా.. ఇప్పుడు ఇద్ద‌ర‌కు మొద‌టిసారి మీడియాకి ముందుకు వ‌చ్చారు. 'తిర‌గ‌బ‌డ‌రా సామీ' మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నారు.


Also Read: ‘ఐబొమ్మ’ పేరు మారిందట.. ఇకపై కొత్త సినిమాలన్నీ అందులోనే!