Actress vanitha vijayakumar Marriage Rumours Goes Viral: నటి వనిత విజయ్‌ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలతో కంటే కూడా కాంట్రవర్సీతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆ మధ్య మూడో పెళ్లి, విడాకులతో వనిత విజయ్‌ కుమార్‌ సంచలనంగా మారింది. అయితే అప్పటికే ఆమె పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల ముందే మూడో భర్తకు పెళ్లిలో లిప్‌లాక్‌ ఇచ్చి ట్రోల్స్‌ ఎదుర్కొంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులు మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చింది. ఇప్పుడు వనిత విజయ్‌ కుమార్‌ వయసు 43 ఏళ్లు. ఈ వయసులో ఈ నటి మళ్లీ పెళ్లికి రెడీ అయ్యిందట.


ఇప్పటికే మూడు పెళ్లిళ్లు


విడాకుల తర్వాత ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్న వనిత విజయ్‌కుమార్‌ ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోవాలుకుంటుందని సినీ సర్కిల్లో టాక్‌. అంతేకాదు వనిత వరుడు వేటలో కూడా ఉందన సమాచారం. ఇప్పటికే వరుడు కూడా ఆమె దొరికాడని, త్వరలోనే తన నాలుగో పెళ్లిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుంటూ సినీవర్గాల నుంచి సమాచారం. దీంతో వనిత మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ వయసులో మళ్లీ పెళ్లేంటంటూ ఆమెను కొందరు విమర్శిస్తున్నారు.  అయితే, వనిత విజయ్ కుమార్ ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, దివంగత తమిళ నటి మంజుల పెద్దల కూతురు అనే విషయం తెలిసిందే. నటి శ్రీదేవి, రుక్మిణిలకు ఆమె స్వయాన సోదరి.


విజయ్ సరసన హీరోయిన్‌గా..


ఇళయ దళపతి విజయ్ నటించిన 'చంద్రలేఖ' సినిమాతో వనిత హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది.  తెలుగు హిట్ మూవీ 'దేవి'తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌ చేసిన ఆమెకు మెల్లిగా అవకాశాలు దగ్గాయి. దీంతో సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అలా బుల్లితెర నటిగా, సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన ఆమె 2000ల సంవత్సరంలో టీవీ నటుడు ఆకాశ్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతకులు హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. కొన్నేళ్ల పాటు ఆన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుని విడిపోయింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన వనిత.. ఆ తర్వాత  2007లో వ్యాపారవేత్త ఆనంద్ జై రాజన్‌ను పెళ్లి చేసుకుంది.



వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఈ పెళ్లి కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కొద్ది రోజులు రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చింది.2012లో రెండో భర్తతో విడిపోయిన ఆమె వీఎఫ్‌ఎక్స్‌ టెక్నీషియన్‌ పీటర్‌ పాల్‌ను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. పీటర్‌తో పెళ్లయిన నాలుగు నెలలకే మనస్పర్థలు రావడంతో అతడికి దూరంగా ఉంది. ఆ తరువాత కొద్ది రోజులకే పీటర్ పాల్ కన్నుమూశారు. వనిత సినిమాల్లో ఫోకస్‌ పెట్టింది. అదే సమయంలో నటుడు నరేష్‌-పవిత్ర మళ్లీ పెళ్లిలో కీలక పాత్ర పోషించింది. నరేష్‌ నిజ జీవిత ఆధారం రూపొందిన ఈ సినిమా వనిత విజయ్‌ కుమార్‌ ఆయన రెండో భార్య రమ్య రఘురామ్‌ పాత్రలో నటించింది. 



Also Read: జర్నీ ఆఫ్‌ విశ్వం - శ్రీనువైట్ల, గోపిచంద్‌ మేకింగ్‌ వీడియో చూశారా? - 'వెంకీ' ట్రైన్‌ కామెడీ రిపీట్‌!