Prabhas Instagram Story : ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఎన్నో ఏళ్లుగా ప్రభాస్ పెళ్లి గురించి ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతీ సంవత్సరం మొదట్లో.. ఈ ఏడాది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి అయిపోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతూనే ఉన్నారు. కానీ అలా జరగడం లేదు. ఎల్లప్పుడూ హాట్ టాపిక్‌గా నడిచే ప్రభాస్ పెళ్లి గురించి స్వయంగా ఈ హీరోనే అప్డేట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.


స్పెషల్ వ్యక్తి..


‘డార్లింగ్స్. ఫైనల్‌గా మన జీవితంలోకి ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు ప్రభాస్. ఇది చూసి ప్రభాస్ పెళ్లి గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాడని చాలామంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కృష్టంరాజు భార్య శ్యామల దేవి కూడా ఈ ఏడాది ఎలాగైనా ప్రభాస్‌కు పెళ్లి చేస్తామని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ఈ అప్డేట్ పెళ్లి గురించే అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కానీ మరికొందరు నెటిజన్లు మాత్రం ముందుగా హీరోలు, హీరోయిన్లు.. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి స్ట్రాటజీని ఉపయోగిస్తారని.. ప్రభాస్ కూడా అలాగే చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




దానిగురించేనా?


ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరో మూడు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. దీంతో ఈ సినిమాల ప్రమోషన్‌లో భాగంగానే ప్రభాస్.. అలాంటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసి ఉంటాడని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD' కోసం ఇండియన్ ఆడియన్స్ అంతా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఈ ప్యాన్ ఇండియా హీరోకు జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో భైరవ అనే క్యారెక్టర్‌లో ప్రభాస్ నటిస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ దీపికా, దిశాల క్యారెక్టర్ల గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇది హీరోయిన్లకు సంబంధించిన అప్డేట్ అయ్యిండవచ్చని, అందుకే స్పెషల్ వ్యక్తి అని ప్రభాస్ అన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్..


‘కల్కి 2898 AD' తర్వాత మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’లో నటిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ‘కల్కి 2898 AD' షూటింగ్ పార్ట్ పూర్తవ్వడంతో ‘రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుందని మేకర్స్ అప్డేట్‌ను విడుదల చేశారు. అయితే ‘రాజా సాబ్’లో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని ఇండస్ట్రీలో రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ మేకర్స్ మాత్రం దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ‘రాజా సాబ్’లో హీరోయిన్స్‌ను పరిచయం చేయడం కోసం ప్రభాస్ అలాంటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసి ఉంటాడా అని ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు.


Also Read: ఎన్టీఆర్ మోసపోయాడు - ఇంటి స్థలం వివాదంలో హైకోర్టుకు వెళ్లిన జూనియర్