Pawan Kalyan Says He Love Horror Movies: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బీజీగా ఉన్నారు వ‌ప‌న్. నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట‌ర్వ్యూలు పెద్ద‌గా ఎవ్వ‌రికీ ఇవ్వ‌రు. ఇచ్చే కొన్ని కొన్ని ఇంట‌ర్వ్యూలు మాత్రం బీభ‌త్సంగా వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు ఆయ‌న ఒక నేష‌న‌ల్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ తెగ వైర‌ల్ అవుతోంది.

Continues below advertisement


హర్రర్ సినిమాలంటే ఇష్టం


జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్  క్యాంపెయిన్ లో బిజీబిజీగా ఉన్నారు. దాంట్లో భాగంగా ఆయ‌న ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. "దాంట్లో మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు?" అని అడిగిన ప్ర‌శ్న‌కి ఆయ‌న "హార‌ర్ సినిమాలంటే చాలా ఇష్టం. నా మైండ్ కామ్ అవ్వ‌డానికి నేను అవి చూస్తాను. నిజానికి బ‌య‌ట ఉన్న దెయ్యాల‌ను ఫేస్ చేయ‌డం కంటే స్క్రీన్ మీద ఉన్న దెయ్యాల‌ను ఫేస్ చేయ‌డం మంచిది అనిపిస్తుంది నాకు" అని ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. "అన్న నువ్వు వాళ్ల‌నే అన్నావు క‌దా? " అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్. 


పొలిటిక‌ల్ గా బిజీ బిజీ.. 


ప్ర‌స్తుతం సినిమాల‌కు విరామం ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న పూర్తి స‌మ‌యం రాజ‌కీయాల‌పైనే పెట్టారు. రోజు ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు ప‌వ‌న్. ఇక ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ క్యాంపెయిన్ లో బిజీ అయ్యారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఎన్నిక‌లు అయ్యాక మాత్ర‌మే మ‌ళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. 



వ‌రుస ప్రాజెక్ట్ లు.. 


ఇక సినిమాల విష‌యానికొస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ కి వ‌రుస ప్రాజెక్టులు ఉన్నాయి. 'హ‌రి హ‌ర వీర మ‌ల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక 'ఓజీ' సెప్టెంబ‌ర్  27న రిలీజ్ కానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ఇటీవ‌ల రిలీజైన 'ఉస్తాద్ భ‌గత్ సింగ్' గ్లింప్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. దాంట్లో జ‌న‌సేన గ్లాసు గుర్తుకు సంబంధించిన డైలాగులు ఫ్యాన్స్ ని ఉర్రూత‌లూగిస్తున్నాయి. 


'హ‌రిహ‌ర వీర మ‌ల్లు' టీజ‌ర్ రిలీజ్.. 


ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఈ రోజు పండుగు చేసుకున్నారు. 'హ‌రి హ‌ర వీర మ‌ల్లు' టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. టీజ‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. టీజ‌ర్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ యాక్టింగ్, ఆయ‌న లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకి మొద‌ట్లో ద‌ర్శ‌కుడు క్రిష్ కాగా.. ఇప్పుడు ఆయ‌న స్థానంలో కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ జ్యోతి కృష్ణ అనే ద‌ర్శ‌కుడు చూసుకుంటాడ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.  క్రిష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు. ఇక ఈ సినిమాకి రెండు భాగాలు ఉన్నాయి. మొద‌టి పార్ట్ 'స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్'. దానికి ట్యాగ్ లైన్ 'ధ‌ర్మం కోసం యుద్ధం' అని పెట్టారు.


Also Read: ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదు, వాళ్లిద్ద‌రే నా ఫ్రెండ్స్: రాజ‌మౌళి