Rajamouli About Ntr: రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య బాండింగ్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఇక 'ఆర్ ఆర్ ఆర్' ప్ర‌మోష‌న్స్ లో కూడా ఎన్టీఆర్ జ‌క్క‌న్న‌ను టీజ్ చేస్తున్న వీడియోలు గ‌తంలో చాలానే వైర‌ల్ అయ్యాయి. దీంతో వాళ్లిద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు అంద‌రూ. అయితే, ఎన్టీఆర్ త‌న ఫ్రెండ్ కాద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు రాజ‌మౌళి. ఆయ‌న ఫ్రెండ్స్ వేరే అని అన్నారు.


ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదు


'కృష్ణమ్మ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్ట‌ర్లు అంద‌రూ పాల్గొన్నారు. రాజ‌మౌళి కూడా చీఫ్ గెస్ట్ గా వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో యాంక‌ర్ వాళ్ల‌ని కొన్ని ప్ర‌శ్న‌ల‌కు అడిగింది. దాంట్లో భాగంగా "మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో చెప్పండి" అని అడ‌గ‌గా.. రాజ‌మౌళి స‌మాధానం చెప్పేందుకు మైక్ తీసుకున్నారు. వెంట‌నే ప్రేక్ష‌కులంతా ఒక్క‌సారిగా "తార‌క్, తార‌క్" అని కేక‌లు వేశారు. అయితే, రాజ‌మౌళి మాత్రం ఆయ‌న పేరు చెప్ప‌లేదు. "తార‌క్ నా ఫ్రెండ్ అన‌లేను. నా త‌మ్ముడు లాంటి వాడు. కొర్రిపాటి సాయి, బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్ శోభు యార్ల‌డ‌గ్గ ఇద్ద‌రు నాకు మంచి ఫ్రెండ్స్" అని చెప్పారు. వెంట‌నే యాంక‌ర్.. "తార‌క్ త‌మ్ముడు అంట ఓకే నా" అని అడ‌గ‌గా.. ఆడియెన్స్ అంద‌రూ ఓకే, సూప‌ర్ అంటూ కేక‌లు వేశారు. 


ఇద్ద‌రి కెరీర్ ఒకేసారి.. 


జూనియ‌ర్ ఎన్టీఆర్, రాజ‌మౌళి ఇద్ద‌రి సినిమా కెరీర్ దాదాపు ఒకేసారి మొద‌లైంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన రెండో సినిమా 'స్టూడెంట్ నెంబర్. 1'. ఇక ఆ సినిమాకి.. రాజ‌మౌళి డైరెక్ష‌న్ చేశారు. రాజ‌మౌళికి డైరెక్ట‌ర్ గా మొద‌టి సినిమా అదే. ఇక  రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశారు. 'సింహాద్రి' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అనంతరం వీరిద్దరి కాంబోలో 'యమదొంగ', 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాలు వచ్చాయి. అవి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇక రాజ‌మౌళి అత్య‌ధిక సినిమాలు చేసిన హీరో కూడా ఎన్టీఆర్. 



'దేవ‌ర‌'లో బిజీగా ఎన్టీఆర్.. 


ఇక 'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత రాజ‌మౌళి ఇంకా కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలు ఎక్కించ‌లేదు. ఎన్టీఆర్ మాత్రం 'దేవ‌ర' సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం 'వార్ - 2' లో కూడా న‌టిస్తున్నారు. 


'ఎస్ ఎస్ ఎంబి.. 29'


ఇక ప్ర‌స్తుతం రాజ‌మౌళి 'ఎస్ ఎస్ ఎంబి - 29' ప‌నుల్లో బిజీగా ఉన్నారు. మ‌హేశ్ బాబు హీరో కాగా.. మిగ‌తా న‌టీన‌టులు ఎవ్వ‌రూ ఫైన‌ల్ కాలేదు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ అయిపోయింద‌ని, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లైంద‌ని అన్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాకి మ‌హేశ్ బాబు కూడా ప్రీపేర్ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న లుక్ చూసిన ఫ్యాన్స్ ఇది 'ఎస్ ఎస్ ఎంబి 29' లుక్ అంటూ కామెంట్లు పెట్టారు.  


Also Read: అఫీషియల్, జపాన్‌లో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న ప్రభాస్‌ 'సలార్‌' - ఎప్పుడంటే!