Om Bheem Bush Collections Day 2: 'సామజవరగమన' సినిమాతో యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. 'ఓం భీమ్ బుష్' సినిమాతో ఈ ఏడాది ఆ సక్సెస్ కంటిన్యూ చేశారు. థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లో 10 క్రోర్స్ మార్క్ రీచ్ అయ్యింది. ప్రజెంట్ కలెక్షన్స్ ఎంతో చూడండి. 


రెండు రోజుల్లో 'ఓం భీమ్ బుష్'కు రూ. 10.44 కోట్లు
Om Bheem Bush Box Office Collections: థియేటర్లలో విడుదలకు ఒక్క రోజు ముందు 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ షో వేశారు. విమర్శకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది. ఆల్మోస్ట్ అందరూ బావుందని, ఈ సినిమా చక్కగా నవ్విస్తుందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి సైతం బ్లాక్ బస్టర్ రెస్సాన్స్ వచ్చింది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 10.44 కోట్లు కలెక్ట్ చేసింది. 


'ఓం భీమ్ బుష్'కు మొదటి రోజు 4.60 కోట్ల రూపాయలు వచ్చాయి. ఓపెనింగ్ డే కలెక్షన్స్ బావున్నాయి. అయితే... మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషం. శనివారం సినిమా కలెక్షన్స్ రూ. 5.84 కోట్లు. సండే అడ్వాన్స్ బుకింగ్స్ సైతం బావున్నాయి. ఈ రోజూ ఐదు కోట్ల మార్క్ రీచ్ కావడం గ్యారంటీ.


Also Read: వెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?






అమెరికాలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?
'ఓం భీమ్ బుష్' సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి సైతం చక్కటి స్పందన లభిస్తోంది. వినోదాత్మక సినిమాలకు ఎన్నారై ఆడియన్స్ నుంచి ఎప్పుడూ రెస్పాన్స్ బావుంటుంది. వినోదంతో పాటు చక్కటి పాటలు, మ్యూజిక్ యాడ్ కావడంతో 'ఓం భీమ్ బుష్' అమెరికాలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 260కె డాలర్స్ కలెక్ట్ చేసింది.


Also Readఏ వతన్ మేరే వతన్ రివ్యూ: Prime Videoలో దేశభక్తి సినిమా - సారా అలీ ఖాన్ నటించిన ఉషా మెహతా బయోపిక్ ఎలా ఉందంటే?






శ్రీ విష్ణుతో పాటు ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. వాళ్ళ క్యారెక్టర్లు డిజైన్ చేసిన తీరుకు, ఆ క్యారెక్టర్లకు రాసిన డైలాగులకు దర్శకుడు ('హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్) శ్రీహర్ష కొనుగంటిని విమర్శకులు మెచ్చుకున్నారు. వి సెల్లులాయిడ్‌ సంస్థతో సునీల్‌ బలుసు నిర్మించిన చిత్రమిది.



'ఓం భీమ్ బుష్'లో శ్రీ విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించారు. ప్రియదర్శి జోడీగా బాలీవుడ్ బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ కనిపించారు. 'పొలిమేర' ఫేమ్ కామాక్షీ భాస్కర్ల అతిథి పాత్రలో సందడి చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నవ్వించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.