'ఛలో', 'భీష్మ'తో యువ దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఆ మధ్య చిరు, వెంకీ కుడుముల కలయికలో డీవీవీ దానయ్య సినిమా అనౌన్స్ చేశారు. ఏమైందో ఏమో గానీ ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. మధ్యలో ఆగింది. అయితే, ఆ దర్శకుడి కొత్త సినిమాకు చిరు ఆశీస్సులు ఇస్తున్నారు.    


నితిన్, రష్మిక సినిమా...
ముఖ్య అతిథిగా చిరు!
నితిన్ (Hero Nithiin), రష్మికా మందన్నా (Rashmika Mandanna) జంటగా వెంకీ కుడుముల 'భీష్మ' తీసి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల... ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 


నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఆ కార్యక్రమానికి చిరు వస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఓ వీడియో విడుదల చేసిన చిత్రబృందం సెల్ఫ్ సెటైర్స్ వేసుకున్నారు.


Also Read : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'






మళ్ళీ సేమ్ హీరోయిన్ - వెంకీపై నితిన్!
'భీష్మ' కంటే ముందు 'ఛలో' సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా అది. కథానాయికగా తెలుగులో రష్మికకు కూడా అదే తొలి సినిమా. 'భీష్మ' ఇంటర్వ్యూల్లో వెంకీ కుడుముల స్క్రిప్ట్ రాయడం కంటే ముందు, ఓం కంటే ముందు కథానాయికగా రష్మిక పేరు రాస్తాడని నితిన్ సరదాగా కామెంట్ చేశారు. మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేశారు. 


'ప్రభా... ఎవరూ ఇంకా రాలేదా?' అని నితిన్ అడుగుతారు. 'హీరోయిన్ ఉదయం 8 గంటలకు వచ్చారు' అని అసిస్టెంట్ నుంచి సమాధానం వస్తుంది. '8 గంటలకా సేమ్ హీరోయినా?' అంటూ నితిన్ అడుగుతారు. ఇంతలో రష్మిక వచ్చారు. 'సేమ్ హీరోయినే. డౌటా?' అని అడుగుతారు. 'అస్సలు లేదమ్మా! మన డైరెక్టర్ స్క్రిప్ట్ లో ఓం రాసే ముందు నీ పేరే రాస్తాడు. నాకు తెలుసుగా' అని నితిన్ ఆన్సర్ ఇచ్చారు. 


రష్మిక కాంట్రవర్సీలు... నితిన్ ఫ్లాపులు!
ఇటీవల రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి. ఆ విషయాన్నీ దర్శకుడు వెంకీ కుడుముల కామెడీ చేసేశారు. 'ఎనిమిది గంటలకు వచ్చి ఏం చేస్తున్నావ్?' అని నితిన్ అడిగితే... 'ఢిల్లీ, బాంబే అభిమానులతో ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ లైవ్ పెట్టుకున్నా. ఈ షూట్ అయిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కొచ్చిన్....' అంటూ రష్మిక చెప్పుకుంటూ వెళితే నితిన్ బ్రేకులు వేస్తారు. నేషనల్ క్రష్ కాబట్టి ఆ మాత్రం ఉంటుందని చెబుతారు. 


Also Read మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల 


'లైవ్ యేనా? కాంట్రవర్సీలు ఏమైనా?' అని నితిన్ అడగబోతే... 'అక్కడికి వెళ్ళవద్దు. నేను ఒక్క మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయి' అని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. 'అది చాలా బెటర్. నేను ఒక్క హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు అవుతున్నాయ్' అని నితిన్ సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు.  


జీవీ... నువ్వు హీరో కాదమ్మా?
నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఆయన తమిళంలో హీరోగా కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్ వేసుకోవడం లేదని, కేవలం మ్యూజిక్ ఇస్తే చాలంటూ అతడి మీద సెటైర్ వేశారు. 'భీష్మ' సినిమా విడుదలైన మూడేళ్లకు వెంకీ కుడుముల సినిమా పట్టాలు ఎక్కుతోంది. ఆ లేటు మీద కూడా సెటైర్ పడింది. తాము ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం లేదని, తమ మనోభావాలు తామే దెబ్బ తీసుకుంటున్నామని వీడియో స్టార్టింగులో నితిన్, రష్మిక చెప్పడం విశేషం