నయనతార జన్మతః క్రిస్టియన్. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం ఆమె హిందూ మతం స్వీకరించారు. తరచూ దేవాలయాలకు వెళుతుంటారు. ఆమెకు భక్తి ఎక్కువ అని చెప్పాలి. హిందూ ధర్మం, సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మరో విషయంలోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

  


Nayanthara With Mangalsutra: పెళ్ళైన తర్వాత విఘ్నేష్ శివన్, నయనతార జంట ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ తీసుకున్న ఫోటోలను విఘ్నేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక్క విషయం గమనిస్తే... నయన్ మోడ్రన్ డ్రస్‌లో ఉన్నప్పటికీ ట్రెడిషన్ మాత్రం మరువడం లేదు. మెడలో మంగళసూత్రం తీయడం లేదు. 


Also Read : నేను బిగ్‌ స్క్రీన్ హీరోను, ఓటీటీలో కనిపించేందుకు ఇష్టపడను : జాన్ అబ్రహం


ప్రజెంట్ జనరేషన్‌లో కొంత మంది మంగళసూత్రం తీస్తున్నారని కొందరు పెద్దలు అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి వాటికి నయన్ ఆస్కారం ఇవ్వడం లేదు. సాంప్రదాయాన్ని ఫాలో అవ్వడమే కాదు... ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.  


సినిమాలకు వస్తే... తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి సోదరి పాత్రలో 'గాడ్ ఫాదర్'లో నయనతార నటిస్తున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న 'జవాన్'లో కథానాయికగా చేస్తున్నారు. ఇంకా ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళ సినిమా ఉన్నాయి. 


Also Read : పరశురామ్ ని హోల్డ్ లో పెట్టిన చైతు - మరో టాలెంటెడ్ డైరెక్టర్ తో!